Kidambi Srikanth: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి, చేజారిన స్వర్ణం, రజతంతో సరి, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్‌ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు.

Kidambi Srikanth: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి, చేజారిన స్వర్ణం, రజతంతో సరి, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్
Srikanth Kidambi - Wikipedia

మాడ్రిడ్, డిసెంబర్ 20: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్‌ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 15వ సీడ్‌ శ్రీకాంత్‌ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్‌ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్‌ కెరీర్‌లో తొలి టైటిల్‌ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్‌ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఓవరాల్‌గా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరిన మూడో భారత ప్లేయర్‌ శ్రీకాంత్. ఇప్పటివరకూ సైనా నెహ్వాల్, పి.వి. సింధు ఈ ఘనత సాధించారు. సైనా నెహ్వాల్ 2015లో, సింధు 2017,2018, 2019లో వరుసగా ఫైనల్ చేరింది. సైనా నెహ్వాల్‌ రజత పతకం గెలుచుకోగా.. సింధు రెండు సార్లు రజతం, ఓ సారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.

(The above story first appeared on LatestLY on Dec 20, 2021 03:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).