T20 World Cup: హై వోల్టేజ్ మ్యాచ్ నేడే.. పోరుకు సిద్ధమైన భారత్-పాకిస్థాన్.. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్.. రికార్డులు తిరగరాయాలని చూస్తున్న పాక్.. ఫలితం కంటే మజా కోసమే చూసే అభిమానులు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమానంగా ఇరు జట్లు..

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. మరికొన్ని గంటల్లో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఆసియాకప్ తర్వాత ఈ రెండు జట్లు తొలిసారి పోటీపడుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ అటెన్షన్‌లోకి వెళ్లిపోతారు.

T20 World Cup: హై వోల్టేజ్ మ్యాచ్ నేడే.. పోరుకు సిద్ధమైన భారత్-పాకిస్థాన్..  ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్.. రికార్డులు తిరగరాయాలని చూస్తున్న పాక్.. ఫలితం కంటే మజా కోసమే చూసే అభిమానులు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమానంగా ఇరు జట్లు..
Ind Vs Pak (Credits: Cricbuzz)

Newdelhi, October 23: ప్రపంచవ్యాప్తంగా (Worldwide) క్రికెట్ అభిమానులు (Cricket Fans) ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. మరికొన్ని గంటల్లో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఆసియాకప్ (AsiaCup) తర్వాత ఈ రెండు జట్లు తొలిసారి పోటీపడుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ (India-Paksitan) జట్ల మధ్య పోరంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ అటెన్షన్‌లోకి వెళ్లిపోతారు. ఈ మ్యాచ్‌లో గెలుపోటములకంటే అది పంచే మజాపైనే అభిమానులు ఎక్కువగా దృష్టిసారిస్తారు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఉన్న రికార్డు మరే దేశానికి లేదు. వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు, టీ20 ప్రపంచకప్‌లో ఐదుసార్లు పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఆ రికార్డును కాపాడుకోవాలని పట్టుదలగా ఉండగా, నేటి మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా ఆ రికార్డును బద్దలుగొట్టాలని బాబర్ ఆజం సేన కసిగా ఉంది.

టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ శుభారంభం.. పెర్త్ లో ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. 5 వికెట్లు తీసిన ఇంగ్లండ్ పేసర్ శామ్ కరన్.. 112 పరుగులకు ఆఫ్ఘన్ ఆలౌట్.. 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో దారుణంగా ఓటమి పాలైన భారత్.. ప్రతికారేచ్ఛతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ పూర్తి ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లోనూ భారత్‌ను ఒకసారి చిత్తు చేసిన పాకిస్థాన్ నేటి మ్యాచ్‌లోనూ అదే ఊపు కొనసాగించాలని పథకం వేసింది. గతంతో పోలిస్తే పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. కాబట్టి నేటి మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ ఓ ప్రణాళిక ప్రకారం ఆడాల్సి ఉంటుంది. అలాగే, గత కొంతకాలంగా పరుగులు చేయడంలో విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ఝళిపించాల్సి ఉంటుంది.

(The above story first appeared on LatestLY on Oct 23, 2022 09:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).