Shafali Verma

New Delhi, July 23: ప్రత్యర్థి నేపాల్‌ జట్టు భారత్‌కు ఏ పరిస్థితుల్లోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్‌ సీతా రానా మాగర్‌ (18) టాప్‌ స్కోరర్‌. భారత్‌ బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా రధా యాదవ్‌, అరుంధతి రెడ్డి చెరో 2 వికెట్లు, రేణుక సింగ్‌ ఒక వికెట్‌ తీశారు.

 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లలో షెఫాలీ వర్మ (81; 48 బంతుల్లో 12×4, 1×6) అర్ధశతకంతో చెలరేగగా..హేమలత (47; 42 బంతుల్లో 5×4, 1×6) విజృంభించింది. నేపాల్‌ బౌలర్లలో సీతారాన మగర్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కబితా జోషి ఒక వికెట్‌ తీసింది.

 

ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచే భారత్‌ బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్ల సాయంతో 10 పరుగులు రాబట్టారు. ఓ వైపు క్రీజులో నిలదొక్కుకుంటూనే నేపాల్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీల మోత మోగిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భయంకరంగా మారిన ఈ జోడీని మగర్ విడొగొట్టింది. జట్టు స్కోరు 122 పరుగుల వద్ద రుబీనాకి క్యాచ్‌ ఇచ్చి.. హేమలత పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సజన (10)తో కలిసి షెఫాలీ వర్మ మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లింది. అయితే 15.3వ బంతికి షెఫాలీ స్టంపౌట్‌ అయ్యింది. ఈ వికెట్‌ కూడా మగర్‌కే దక్కింది. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే సజన కూడా కబితా జోషి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. చివర్లో రోడ్రిగ్స్‌ (28*; 15 బంతుల్లో 5×4), రిచా ఘోష్‌ (6; 3 బంతుల్లో 1×4) దూకుడుగా ఆడటంతో.. భారత్‌ భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. తాజా విజయంతో గ్రూప్‌ ఏ నుంచి భారత్‌, పాకిస్థాన్‌ జట్లు సెమీస్‌కు చేరగా.. నేపాల్‌, యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.