Team India At Delhi: న్యూఢిల్లీకి చేరుకున్న వరల్డ్ కప్ విన్నర్స్, ఎయిర్ పోర్టు దగ్గర కోలాహలం, స్వదేశంలో అడుగు పెట్టిన వెంటనే రోహిత్, కోహ్లీ ఏం చేశారో చూడండి!
టీమిండియా స్వదేశానికి (Indian Cricket Team) చేరుకుంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియాకు (Indian Cricket Team) ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రపంచ కప్ (World Cup) కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని అభిమానులు అన్నారు.
New Delhi, July 04: టీమిండియా స్వదేశానికి (Indian Cricket Team) చేరుకుంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియాకు (Indian Cricket Team) ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రపంచ కప్ (World Cup) కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని అభిమానులు అన్నారు. భారత క్రికెటర్లు షెడ్యూల్ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సి ఉన్నప్పటికీ తుపాను వల్ల బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసి వేయడంతో అక్కడే హోటల్లో ఉన్నారు. ఇప్పుడు తుపాను కాస్త తగ్గడంతో భారత ఆటగాళ్లను అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, తీసుకొచ్చింది.
Men's Indian Cricket Team lands at Delhi airport after winning the #T20WorldCup2024 trophy.
(Source: Delhi Airport) pic.twitter.com/kaCCjYy2oM
— ANI (@ANI) July 4, 2024
ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో (Airport) టీమిండియా దిగింది. వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్కరిస్తారు. అనంతరం భారత క్రికెటర్లు పలు కార్యక్రమాల్లో పాల్గొని, తమ సొంత నగరాలకు వెళ్తారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే.
#WATCH | Captain Rohit Sharma with the #T20WorldCup trophy at Delhi airport as Team India arrives from Barbados, after winning the T20I World Cup.
(Earlier visuals) pic.twitter.com/ORNhSBIrtx
— ANI (@ANI) July 4, 2024
మోదీతో బ్రేక్ఫాస్ట్ (Breakfast with Modi) తర్వాత మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా ముంబైకి వెళ్లనున్న భారత జట్టు.. సాయంత్రం విజయోత్సవ ర్యాలీలో పాల్గొననుంది. ముంబైలోని ప్రఖ్యాత నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం దాకా ఓపెన్ బస్లో ప్రపంచకప్ వీరులు విక్టరీ పరేడ్లో పాల్గొంటారు.
#WATCH | Indian Cricket Team Captain Rohit Sharma along with his family at ITC Maurya Hotel in Delhi, after winning the #T20WorldCup2024 trophy. pic.twitter.com/Kvk0DkgAMB
— ANI (@ANI) July 4, 2024
ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియాను గౌరవించుకునేందుకు విజయోత్సవ ర్యాలీలో భారీగా పాల్గొనండి’ అని ట్వీట్ చేశాడు.
#WATCH | Virat Kohli, Hardik Pandya, Sanju Samson, Mohammed Siraj along with Team India arrived at Delhi airport, after winning the #T20WorldCup2024 trophy.
(Earlier visuals) pic.twitter.com/eCWvJmekEs
— ANI (@ANI) July 4, 2024
‘ఈ ఆనంద క్షణాలను మేము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. మెరైన్ డ్రైవ్ నుంచి మొదలుకాబోయే విక్టరీ పరేడ్లో కలుద్దాం’ అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ర్యాలీ ముగిశాక బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడేలో ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి చిరు సత్కారం ఏర్పాటు చేసింది. బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్మనీనీ ఇక్కడే అందజేసే అవకాశమున్నట్టు సమచారం.
(The above story first appeared on LatestLY on Jul 04, 2024 08:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

