T20 World Cup: పాకిస్థాన్ క్రికెటర్ ఆసిఫ్ చేసిన పనికి, ఆఫ్ఘనిస్థాన్ రాయబారి షాక్, ఆసిఫ్ నీకు బుద్ధి ఉందా..?

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లో, ఆసిఫ్ తన బ్యాటును గన్ లాగా మార్చి గాల్లో కాల్పులు జరుపుతున్నట్లు చేసి సెలబ్రేషన్ చేసాడు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

T20 World Cup: పాకిస్థాన్ క్రికెటర్ ఆసిఫ్ చేసిన పనికి, ఆఫ్ఘనిస్థాన్ రాయబారి షాక్, ఆసిఫ్ నీకు బుద్ధి ఉందా..?
(Image Crediit : Twitter)

Dubai. Oct 31: టీ20 ప్రపంచకప్ 2021లో తమ మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. వరుసగా మూడో విజయంతో బాబర్ అజామ్ జట్టు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు బలంగా మారాయి. నాలుగు సిక్సర్ల సాయంతో అజేయంగా 25 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ విజయంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అసిఫ్ అలీ ముఖ్యమైన పాత్ర పోషించాడు.

ఇప్పుడు ఆసిఫ్ అలీ ఒక ప్రత్యేక కారణంతో హెడ్‌లైన్స్‌లో ఉన్నాడు. వాస్తవానికి, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లో, ఆసిఫ్ తన బ్యాటును గన్ లాగా మార్చి గాల్లో కాల్పులు జరుపుతున్నట్లు చేసి సెలబ్రేషన్ చేసాడు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చర్యపై శ్రీలంకలో పనిచేస్తున్న ఆఫ్ఘనిస్థాన్ రాయబారి ఎం. అష్రఫ్ హైదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసిఫ్ అలీ చర్యను విమర్శిస్తూ హైదరీ ట్వీట్ చేస్తూ, 'పాకిస్థాన్ ప్రముఖ ఆటగాడు అసిఫ్ అలీ చేసిన దూకుడు సిగ్గుమాలిన చర్య. అఫ్ఘాన్‌ ఆటగాళ్లకు తుపాకీలా బ్యాట్‌ని చూపించడం తగదని పేర్కొన్నాడు. అన్నింటికంటే మించి క్రికెట్  క్రీడ ఆరోగ్యకరమైన పోటీ, స్నేహం , శాంతితో ముడిపడి ఉందని గుర్తు చేశాడు.

ఈ చిత్రంపై వివాదం తర్వాత, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫోటోతో పాటు ఆసిఫ్ అలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 31 అక్టోబర్ 2005న, శ్రీలంకతో జరిగిన ODI మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసిన తర్వాత, ఈ విధంగానే గన్ మాదిరిగా బ్యాట్ పట్టుకున్నాడు.

పాకిస్థాన్ వార్తాపత్రిక డాన్ జర్నలిస్ట్ అబ్దుల్ గఫార్ ట్వీట్ చేస్తూ, 'శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ కూడా అదే చేశాడు. కానీ శ్రీలంక ప్రజలు తెలివైనవారు , వారు గొప్ప స్ఫూర్తితో క్రికెట్ ఆడతారు. క్రీడలతో రాజకీయాలను కలపవద్దని పేర్కొన్నాడు.

జైపూర్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఎంఎస్ ధోని అజేయంగా 183 పరుగులు చేయడం గమనార్హం. ఇది అతని అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు కూడా. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో 23 బంతులు మిగిలి ఉండగానే సాధించింది.

(The above story first appeared on LatestLY on Oct 31, 2021 02:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).