Andhra Pradesh: కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు ఆదేశాలు
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు.
Vjy, Dec 20: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఉన్నారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమశాతం నిర్ధరణ చేసే మిషన్ పనితనంపై ఆరా తీశారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తేమశాతంలో సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని.. కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హెచ్చరించారు. సీఎం మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు.
CM Chandrababu Naidu Visits Krishna District's Agricultural Centers
ధాన్యం కొనుగోళ్ళలో రైతుల సమస్యల పరిష్కారానికి నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. గంగూరులో రైతు సేవాకేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి, ఆ పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును తనిఖీ చేసారు. సిబ్బంది, రైతులు, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. #FarmersFriendlyGovt… pic.twitter.com/y60oyK7W2r
— Telugu Desam Party (@JaiTDP) December 20, 2024
అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని పేర్కొన్నారు. రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. తేమ శాతం, ఇతరత్రా అంశాల్లో కచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. రైతులకు ఐవీఆర్ఎస్పై స్వయంగా అవగాహన కల్పించారు.. దాని ద్వారా ఫీడ్బ్యాక్ పంపాలని సూచించారు.
(The above story first appeared on LatestLY on Dec 20, 2024 05:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

