AP Budget Today: ఏపీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే.. రూ. 2.90 లక్షల కోట్లతో 2024–25 వార్షిక బడ్జెట్.. ఆ హామీల అమలుకు బడ్జెట్ లో పెద్దపీట??
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Vijayawada, Nov 11: ఆంద్రప్రదేశ్ (Andhrapradesh) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Sessions) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రూ. 2.90 లక్షల కోట్లతో 2024–25 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎన్నికల హామీల్లో భాగమైన సూపర్ -6 పథకాల అమలుకు వార్షిక బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అభివృద్ధి – సంక్షేమం సమతూకంగా బడ్జెట్ రూపకల్పన చేయనున్నారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2.9 లక్షల కోట్లతో తొలి బడ్జెట్
ఈ రోజు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
పయ్యావుల కేశవ్కి బడ్జెట్ పత్రాలు అందజేసిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీయూష్ కుమార్
బడ్జెట్ పత్రాలతో నేరుగా సీఎం… pic.twitter.com/9Mw99SXqTs
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2024
మంత్రివర్గం ఆమోదం తర్వాత
ఉదయం 9.20 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అనంతరం బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తరువాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. 22వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
(The above story first appeared on LatestLY on Nov 11, 2024 09:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

