Gun Fire in AP: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం.. ఇద్దరికి తీవ్రగాయాలు.. అసలేం జరిగిందంటే??
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో కాల్పులు కలకలం సృష్టించాయి. మండలంలోని మాధవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై నాటు తుపాకీలతో కాల్పులు జరిపారు.
Vijayawada, Dec 21: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. మండలంలోని మాధవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై నాటు తుపాకీలతో కాల్పులు జరిపారు. దీంతో హనుమంతు (50), రమణ (30) అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని రాయచోటి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం
- రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరిపై కాల్పులు
- పాత సామగ్రి వ్యాపారులపై నాటు తుపాకీతో కాల్చిన దుండగుడు
- కాల్పుల్లో హనుమంతు(50), రమణ(30)కు తీవ్రగాయాలు
- రాయచోటి ప్రభుత్వాస్పత్రికి బాధితుల తరలింపు
- కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు..…
— Telangana Awaaz (@telanganaawaaz) December 22, 2024
నిందితుల కోసం గాలింపు
కాల్పుల్లో గాయాలపాలైన బాధితులిద్దరూ పాత సామానుల వ్యాపారం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాల్పుల ఘటనకు కారణంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

