IMD Weather Alert: ఇంకా ముప్పు పోలే.. ఆంధ్రప్రదేశ్కు పొంచి ఉన్న మరో తుఫాను గండం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా సైక్లోన్గా మారే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 5 నుంచి మరో మరో ముప్పును చూసే అవకాశం ఉందని IMD తెలిపింది.సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది" అని IMD నుండి సోమవారం (సెప్టెంబర్ 2, 2024) అధికారిక ప్రకటన వెలువడింది.
Vjy, Sep 3: బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 5 నుంచి మరో మరో ముప్పును చూసే అవకాశం ఉందని IMD తెలిపింది.సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది" అని IMD నుండి సోమవారం (సెప్టెంబర్ 2, 2024) అధికారిక ప్రకటన వెలువడింది. దీని ప్రభాంతో అనేక ప్రాంతాల్లో భారీ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శాంతించిన బుడమేరు, ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద, ఊపిరి పీల్చుకున్న బెజవాడ వాసులు, కృష్ణమ్మ ఉగ్రరూపానికి బెంబేలెత్తిన విజయవాడ
ఏపీ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం సృష్టించిన విలయం మరువకముందే మరో తుఫాను గండం ముంచుకొస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అల్పపీడనాన్ని ప్రేరేపించడానికి గల కారణాలను వివరిస్తూ, IMD అధికారులు పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనాన్ని అభివృద్ధి చేసే క్రియాశీల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది ఏర్పడిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్లు రెండూ హై అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది” అని IMD అధికారి అభిప్రాయపడ్డారు.
(The above story first appeared on LatestLY on Sep 03, 2024 01:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

