YCP MP Beeda Masthan Rao Daughter Arrest: వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు ర్యాష్ డ్రైవింగ్.. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. నిద్రిస్తున్న యువకుడి మృతి.. నిందితురాలి అరెస్ట్.. అనంతరం బెయిల్ పై విడుదల
చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూతురు మాధురి అరెస్టు అయ్యారు.
Chennai, June 19: చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు (YCP MP Beeda Masthan Rao) కూతురు మాధురి అరెస్టు అయ్యారు. బిసెంట్ నగర్ లో ఎంపీ కూతురు నడుపుతున్న కారు ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. అయితే అక్కడే సూర్య అనే యువకుడు నిద్రిస్తున్నాడు. అతనిని గమనించకుండా మస్తాన్ రావు కూతురు సోమవారం సాయంత్రం కారు పోనిచ్చారు. దీంతో సూర్య తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు సూర్య భార్య వినిత కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మాధురిని అరెస్ట్ చేశారు. ఆ వెంటనే స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి (33) అరెస్ట్
చెన్నైలోని బీసెంట్ నగర్లో ఫుట్ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వృత్తిరీత్యా పెయింటర్ సూర్య (24) అనే యువకుడి పై కారు దూసుకెల్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వైసీపీ రాజ్యసభ ఎంపీ… pic.twitter.com/xTlnjZJXvZ
— Aadhan Telugu (@AadhanTelugu) June 19, 2024
అలా కనుక్కొన్నారు
ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపిన మాధురి, ఆమె స్నేహితురాలు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. స్థానికులు వచ్చి ప్రశ్నించడంతో మాధురి ఫ్రెండ్ వాదనకు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంబులెన్స్ కు కాల్ చేసిన నంబర్ ఆధారంగా పోలీసులు మాధురిని కనుకొన్నారు.
(The above story first appeared on LatestLY on Jun 19, 2024 09:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

