Monsoon 2021 Update: ఆంధ్రప్రదేశ్ను తాకిన రుతుపవనాలు, రాగల 24 గంటల్లో ఏపి, టీఎస్లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
తెలుగు రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను తాకిన రుతుపవనాలు శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా...
Hyderabad, June 10: తెలుగు రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను తాకిన రుతుపవనాలు శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరోవైపు తూర్పు ఈశాన్య బంగాళాఖాతం, మయన్మార్ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 11న అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.
దీని కారణంగా జూన్ 11 నుంచి 14 వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావం కారణంగా తీరప్రాంతం ఈ నెల 11 నుండి గందరగోళంగా ఉంటుంది మరియు తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు 11 నుంచి 15 వరకు వేటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు.
అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 12- 13 తేదీల మధ్య పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Jun 10, 2021 12:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

