Hyderabad Marathon 2024: హైదరాబాద్ మారథాన్-2024 ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్-2024 13వ ఎడిషన్ కాసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది.

Hyderabad Marathon 2024: హైదరాబాద్ మారథాన్-2024 ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
Hyderabad Marathon 2024 (Credits: X)

Hyderabad, Aug 25: హైదరాబాద్ (Hyderabad) రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ (NMDC) హైదరాబాద్ మారథాన్-2024 (Hyderabad Marathon 2024) 13వ ఎడిషన్ కాసేపటి క్రితం  లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది. ఫుల్ మారథాన్‌ ను జెండా ఊపి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆరంభించారు. మారథాన్‌ లో వివిధ దేశాలకు చెందిన రన్నర్లు కూడా పాల్గొన్నారు. ఈ మారథాన్‌ ను హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి సరికొత్తగా ఎన్ఎండీసీ మారథాన్‌ ను స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు.

N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున, కోర్టు ఆదేశాలకు విరుద్దంగా కూల్చివేత,ఒక్క అంగుళం కూడా ఆగ్రమించలేదు

అందుకోసమే మారథాన్

ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్ ఫిట్‌ నెస్ అవేర్‌ నెస్ పెంచేందుకు దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద రెండో మారథాన్ గా ఇది రికార్డు సృష్టించనున్నదని వెల్లడించారు.

25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్.. కేంద్రం నుంచి కొత్త పెన్షన్ విధానం.. 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి

(The above story first appeared on LatestLY on Aug 25, 2024 08:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).