KTR on ACB Case: రేవంత్ రెడ్డికి ఉన్న భ‌యం అదే! అందుకే నాపై కేసు పెట్టారు, కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రెండు రోజులుగా స్పీక‌ర్‌ను కోరాం.. స‌భ న‌డుస్తోంది. కుంభ‌కోణం లంబ‌కోణం అని కేబినెట్‌లో ప‌రిశోధించి.. ఏదో సాధించిన‌ట్లు లీకులు ఇస్తున్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య న‌లుగురు స‌న్నాలు మాట్లాడుడు ఏంటి..? నాలుగు కోట్ల ప్ర‌జ‌ల ముందు చ‌ర్చ పెడుదాం.. దూద్ కా దూద్ పానీ కా పానీ అయిత‌దిని చెప్పినం. కానీ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంది.

KTR on ACB Case: రేవంత్ రెడ్డికి ఉన్న భ‌యం అదే! అందుకే నాపై కేసు పెట్టారు, కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
KTR Slams Congress on Unfulfilled promises, discontent(X)

Hyderabad, DEC 19: ఫార్ములా – ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. ఈ వ్య‌వ‌హారంలో రేవంత్ రెడ్డి చేసేది ల‌త్కోర్ ప‌ని అని ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్. ఫార్ములా -ఈ రేస్‌పై (Formula E Car Race) అసెంబ్లీలో చ‌ర్చించేందుకు రేవంత్ స‌ర్కార్ భ‌య‌ప‌డుతోంద‌ని కేటీఆర్ (KTR Press Meet) తేల్చిచెప్పారు. ఈ కేసు వ్య‌వ‌హారంపై తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గ‌త రెండు రోజులుగా స్పీక‌ర్‌ను కోరాం.. స‌భ న‌డుస్తోంది. కుంభ‌కోణం లంబ‌కోణం అని కేబినెట్‌లో ప‌రిశోధించి.. ఏదో సాధించిన‌ట్లు లీకులు ఇస్తున్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య న‌లుగురు స‌న్నాలు మాట్లాడుడు ఏంటి..? నాలుగు కోట్ల ప్ర‌జ‌ల ముందు చ‌ర్చ పెడుదాం.. దూద్ కా దూద్ పానీ కా పానీ అయిత‌దిని చెప్పినం. కానీ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంది.

Telangana: ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ అవకతవకలపై విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు, హరీష్‌రావు విజ్ఞప్తి మేరకు సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి 

వాళ్ల‌కు కూడా తెలుసు.. ఇందులో ఏం లేదు.. చేసేది ల‌త్కోర్ ప‌ని సాటుమాటుగా చేయాలి.. ఓపెన్‌గా చేస్తే ఇజ్జ‌త్ పోత‌ద‌ని భ‌య‌ప‌డుతున్నారు.

BRS Working President KTR on ACB Case

 

ద‌మ్ముంటే చ‌ర్చ పెట్టాల‌ని స్పీక‌ర్‌ను అడిగాను. చ‌ర్చ‌కు రాలేదు. నిన్న సీఎంకు లేఖ రాశాను. కేసు అంటున్నావ్ క‌దా.. చ‌ర్చ పెట్ట‌మంటే ద‌మ్ము లేదు. ఈ విష‌యం మీద చ‌ర్చించే ద‌మ్ము ప్ర‌భుత్వానికి లేదు. ఫార్ములా -ఈ రేస్ గురించి ప్ర‌భుత్వానికి తెలియ‌దు. సీఎం చ‌ర్చ‌లో పాల్గొని క‌ళ్ల‌ల్లో క‌ళ్లు పెట్టి ధైర్యంగా నిరూపించే శ‌క్తి లేదు. ఏదో ఒక కేసు పెట్టాల‌ని శాడిస్ట్ మెంటాల్టి త‌ప్ప ఇంకోటి లేదు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నిజాలు చెప్పాల‌నే ఉద్దేశంతో ఈ మీడియా స‌మావేశం ఏర్పాటు చేశాన‌ని కేటీఆర్ తెలిపారు.

(The above story first appeared on LatestLY on Dec 19, 2024 09:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).