Yashwanth Sinha In Hyderabad: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్, ఒకే వాహనంలో జలవిహార్ బయలుదేరిన కేసీఆర్, సిన్హా, 5 వేల బైకులతో భారీ ర్యాలీ..

యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గాడ్, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితర నేతలు ఘన స్వాగతం పలికారు.

Yashwanth Sinha In Hyderabad: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్, ఒకే వాహనంలో జలవిహార్ బయలుదేరిన కేసీఆర్, సిన్హా, 5 వేల బైకులతో భారీ ర్యాలీ..
Yashwant Sinha Visit Hyd (Photo-TRSOffice)

యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గాడ్, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితర నేతలు ఘన స్వాగతం పలికారు.  5 వేల మంది కార్యకర్తలతో విమానాశ్రయం నుండి జలవిహార్ వరకు బైక్ ర్యాలీ నిర్విహించారు. అక్కడ టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సంభాషించనున్నారు.

ఈ సందర్భంగా ఎల్‌బీనగర్‌ శాసనసభ్యుడు డి.సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. శుక్రవారం ఇక్కడ నిర్వహించిన బీజేపీ ర్యాలీకి పోటీగా టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించడం లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సిన్హాకు ఓటు వేయాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కేసీఆర్ అడుగుతారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ముందు ఏ పార్టీ నిలబడదని సుధీర్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు రాష్ట్రపతి ఎన్నికల్లో తన అభ్యర్థిత్వం కోసం వివిధ రాజకీయ పార్టీల మద్దతు కోరుతూ సిన్హా తన పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటలకు MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ITC కాకతీయలో కలుస్తారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోవడంతో బేగంపేట విమానాశ్రయంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

(The above story first appeared on LatestLY on Jul 02, 2022 12:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).