Etela Rajendar: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పతనం మొదలైంది..  ఈటల సంచలన వ్యాఖ్యలు
Credits: Twitter

Hyderabad, Jan 20: బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) సీఎం కేసీఆర్ (CM KCR) పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ (TRS) ను బీఆర్ఎస్ (BRS) గా మార్చడంతోనే కేసీఆర్ పతనం మొదలైందని అన్నారు. దళితులను వంచించి అధికారంలోకి వచ్చిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడని, కానీ అవన్నీ వట్టిమాటలుగానే మిగిలిపోయాయని అన్నారు. కేసీఆర్ చాంబర్ లో ఒక్క దళిత అధికారి కూడా లేరని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకే దళితబంధు ఇస్తున్నారని ఈటల ఆరోపించారు.

డెక్కన్ స్టోర్‌ ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు, ఆందోళన కలిగిస్తున్న బిల్డింగ్ లోపలపేలుడు శబ్దాలు, దాదాపు 4 గంటలకు పైగా సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

సామాన్యులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్, అధికారంలోకి వచ్చాక అణచివేస్తున్నారని ఈటల మండిపడ్డారు.  మాయమాటలు చెప్పి ఓట్లు పొందారని, ఇప్పుడదే మోడల్ ను దేశమంతా వర్తింపజేస్తావా? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం చూస్తుంటే, కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుందని ఎద్దేవా చేశారు.

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం, మొదటి అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్టుగా వార్తలు, కొనసాగుతున్న సహాయక చర్యలు