MP Kishan Reddy: తెలంగాణలో భవిష్యత్తు మాదే: బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి

తెలంగాణలో పదేళ్లలో 10 లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కాంగ్రెస్ మాపై విష ప్రచారం చేసింది. అయినా ప్రజలు దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా మా పార్టీకి భారీగా సీట్లు కట్టబెట్టారని ఎంపీ కిషన్ రెడ్డి అన్నారు.

MP Kishan Reddy: తెలంగాణలో భవిష్యత్తు మాదే: బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి
Union Minister G Kishan Reddy (photo-ANI)

తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని, ఇక భవిష్యత్తు బీజేపీదేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా వద్దనుకుని ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎన్నుకుంటున్నారని, అందుకే రాష్ట్రంలో బీజేపీ బలం నానాటికీ పెరుగుతోందని అన్నారు. గురువారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోయిందని, తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు.

‘‘తెలంగాణలో పదేళ్లలో 10 లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కాంగ్రెస్ మాపై విష ప్రచారం చేసింది. అయినా ప్రజలు దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా మా పార్టీకి భారీగా సీట్లు కట్టబెట్టారు. కాంగ్రెస్‌ గెలిచిన స్థానాల్లో కూడా ఆ పార్టీకి పోలింగ్‌ శాతం తగ్గింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం మల్కాజిగిలోనూ బీజేపీకి 4 లక్షల మెజార్టీ వచ్చింది. మెదక్‌లో గెలిచేందుకు కాంగ్రెస్ వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలకు బీజేపీకే పట్టం కట్టారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా.. 8 ఎంపీ స్థానాల్లో గెలిచాం. 7 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచాం. అంటే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను కాదని ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసం చూపించారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడై బీజేపీ పనిచేస్తుంది. ఇక భవిష్యత్తు మాదే’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

(The above story first appeared on LatestLY on Jun 06, 2024 07:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).