Baboon At Hanuman Temple (Credits: X)

Nirmal, Feb 16: సాధారణంగా కొన్నిసార్లు జంతువులు (Animals) గుళ్లలో ప్రవేశిస్తుంటాయి. మనుషుల్లా పూజలు చేయాలనుకుంటాయో ఏంటో కానీ.. అవి దేవుడి గుడుల చుట్టు ప్రదక్షిణలు చేస్తుంటాయి. ఇటీవల కొన్ని జంతువులు దేవుడి విగ్రహాలను కొలవడం వార్తలలో తరుచూ కనిపిస్తూనే ఉంది. ఇదీ అలాంటి ఘటనే.. నిర్మల జిల్లా బాసరలోని దాస ఆంజనేయ స్వామి ఆలయంలోకి (Hanuman Temple) ఇటీవల ఓ కొండముచ్చు ప్రవేశించింది. హనుమంతుడి విగ్రహం పాదాల వద్ద కూర్చొన్న ఆ కొండముచ్చు కాసేపు అలాగే మౌనంగా ఉండసాగింది. దీంతో ఆ జీవిని హనుమంతుడిగా భావించి భక్తులు పూజలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో నలుగురు చిన్నారులు.. 11 మంది మహిళలు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

ఏపీలో శివలింగంపై నాగమ్మ

ఇటీవల ఏపీలో మాఘీ పౌర్ణమి వేళ ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విశాఖలోని  చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న శివాలయంలో ఒక నాగుపాము ప్రవేశించింది. చాలా సేపు అది శివలింగంపైన ఎక్కి పడగ విప్పి కూర్చుంది. అక్కడి  భక్తులు నాగు పామును చూస్తూ పూజలు చేశారు.

దీపాదాస్ మున్షీ క్రమశిక్షణ గల నాయకురాలు..తప్పుడు ప్రచారం సరికాదన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక

మరికొన్ని ఘటనలు కూడా..

ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో మరికొన్ని జరిగాయి. కొన్ని రోజుల క్రితం శనీ సింగ్నాపూర్ లోని ఒక ఆలయంలో పిల్లి దేవుడి ఆలయం చుట్టుచాలా సేపు తిరిగింది. అదే విధంగా ఒక ఆంజనేయ స్వామి ఆలయంలో కోతి గదను పట్టుకుని హనుమంతుడి విగ్రహాం దగ్గర చాలా సేపు అలానే కూర్చుంది. మరోవైపు  ఇటీవల ఒక ఎలుగు బంటి శివలింగం పైకెక్కి.. అచ్చం మార్కెండేయుడిలా గట్టిగా పట్టేసుకుంది.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.