TET exam: టెట్ ఎగ్జామ్‌కు వెళ్తున్నారా? ఇవి తప్పనిసరి, హాల్ టికెట్‌ పై అభ్యర్ధుల ఫోటో లేకపోతే ఏం చేయాలో తెలుసా? ఇలా చేయండి సరిపోతుంది, అభ్యర్ధులకు టెట్ కన్వీనర్ సూచనలు

టెట్‌ హాల్‌టికెట్లపై అభ్యర్థుల ఫొటో, సంతకం లేకుంటే.. అటెస్టేషన్‌ తప్పనిసరి అని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి స్పష్టం చేశారు. ఫొటో, సంతకం సరిగాలేకపోయినా, అసలు లేకపోయినా సదరు అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఇటీవలే తీయించుకున్న ఫొటోను అతికించి గెజిటెడ్‌ అధికారిచే అటెస్టేషన్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత ఆధార్‌కార్డు లేదా ఇతర ఐడీకార్డుతో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)ను సంప్రదించాలి.

TET exam: టెట్ ఎగ్జామ్‌కు వెళ్తున్నారా? ఇవి తప్పనిసరి, హాల్ టికెట్‌ పై అభ్యర్ధుల ఫోటో లేకపోతే ఏం చేయాలో తెలుసా? ఇలా చేయండి సరిపోతుంది, అభ్యర్ధులకు టెట్ కన్వీనర్ సూచనలు
Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, June 08: టెట్‌ హాల్‌టికెట్లపై (TET Hall ticket) అభ్యర్థుల ఫొటో, సంతకం లేకుంటే.. అటెస్టేషన్‌ తప్పనిసరి అని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి స్పష్టం చేశారు. ఫొటో, సంతకం సరిగాలేకపోయినా, అసలు లేకపోయినా సదరు అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఇటీవలే తీయించుకున్న ఫొటోను (Photo) అతికించి గెజిటెడ్‌ (Gazetted Officer) అధికారిచే అటెస్టేషన్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత ఆధార్‌కార్డు లేదా ఇతర ఐడీకార్డుతో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)ను సంప్రదించాలి. డీఈవో (DEO)పరిశీలన అనంతరమే అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తామన్నారు. ఇక పేరులో అక్షరదోషాలు, తల్లి, తండ్రి పేరు పుట్టిన తేదీ, కులం, లింగం(Gender), పీహెచ్‌సీ (PHC) వంటి వివరాలను సరిగా లేనిచో ఎగ్జామ్‌ సెంటర్‌లో (Exam center) నామినల్‌రోల్‌ కమ్‌ ఫొటో ఐడెంటిటీలో వాటిని సరిచేసుకోవచ్చని రాధారెడ్డి సూచించారు.

NEET PG Exam 2022 Date: నీట్ పీజీ 2022 ప‌రీక్ష‌ వాయిదా, 6 నుంచి 8 వారాల వ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య‌శాఖ 

ఈ నెల 12వ తేదీన జ‌రిగే టెట్ ఎగ్జామ్‌కు (TET Exam) ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు. ఉదయం 9:30 గంట‌ల‌కు, మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో పరీక్షకు అనుమతించమన్నారు. కావున అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, కనీసంగా గంట ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని, ప్రశ్నపత్రాలను జిల్లాలకు చేరుస్తున్నామన్నారు.

AP Inter Exam 2022 Postponed: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ, ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు.. 

ఈ నెల 12 న జరిగే టెట్ ఎగ్జామ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 6లకల  మంది టెట్ ఎగ్జామ్ రాయనున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 08, 2022 11:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).