Hyd, Feb 3: హైదరాబాద్ పోలీసులు కరుడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసులు గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద ఘరానా నేరస్తుడు బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి (Battula Prabhakar Arrest) తీసుకున్నారు. ఈ సమయంలో ప్రభాకర్ రెండు రౌండ్లు కాల్పులు పోలీసులపై జరిపాడు. అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు తుపాకులు, 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
సోదాల్లో అధికారులు 428 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ ప్రభాకర్ విచారణలో ఇచ్చిన సమాచారం మేరకు ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. విచారణలో అతని సుదీర్ఘ నేర చరిత్రకు సంబంధించిన షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన డీసీపీ వినీత్ మీడియాకు వివరాలు తెలిపారు.
చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ప్రభాకర్ మార్చి 22న పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి తప్పించుకుని పోలీసులకు సవాల్ గా మారాడు. గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ దగ్గర పోలీసులు అతడిని పట్టుకున్నారు. అధికారులు అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, ప్రభాకర్ ప్రతిఘటించి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి కాలికి బుల్లెట్ గాయమైంది. పోలీసులు ప్రభాకర్ను అదుపు చేసి అరెస్ట్ చేశారు.
Battula Prabhakar Arrest
జేబు దొంగ నుండి కోట్లకు పడగెత్తిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్
చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ప్రభాకర్ 8వ తరగతిలోనే చదువు ఆపేసి దొంగతనాలు మొదలెట్టాడు
రూ.3000 దొంగతనంతో మొదలైన అతని క్రిమినల్ ప్రయాణం కోట్లకు చేరింది
విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలలో ఉండటం, అమ్మాయిలతో… https://t.co/HJZBD5sWj6 pic.twitter.com/OAVpcR5EQ6
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025
ప్రభాకర్కు సుదీర్ఘ నేర చరిత్ర ఉంది, అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 80 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 68, ఆంధ్రప్రదేశ్లో 12 కేసులు నమోదయ్యాయి. రెండు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో ఒకడు. ఇతను తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకలో కూడా నేరాలకు పాల్పడ్డాడు.
తన నేర జీవితంలో తొలినాళ్లలో, ప్రభాకర్ ప్రధానంగా నివాస ప్రాంతాల్లో చోరీలు చేసేవాడు. ఆ తరువాత రూటు మార్చాడు. ఊరి బయట ఉండే విద్యాసంస్థల్లో ఎక్కువగా చోరీలకు పాల్పడేవాడని వివరించారు. అతడు 2013 నుంచి నేరాల బాటపట్టాడని, చోరీకి వచ్చే ముందు తప్పనిసరిగా రెక్కీ చేసేవాడని తెలిపారు.అవి తక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయని నమ్మాడు. అతను తన నేరాలను జాగ్రత్తగా ప్లాన్ చేశాడు, వాటిని అమలు చేయడానికి ముందు నిఘా నిర్వహించాడు.
పోలీసు కస్టడీ నుండి తప్పించుకోవడం, పట్టుబడకుండా ఉండడం ఎలాగో తెలుసుకోవడానికి ప్రభాకర్ యూట్యూబ్ ట్యుటోరియల్లను కూడా ఉపయోగించాడు . గతంలో జైలులో ఉన్న సమయంలో, అతను మరొక ఖైదీపై వ్యక్తిగత పగ పెంచుకున్నాడు.అతనిని చంపడానికి బత్తుల ప్రభాకర్ బీహార్ లో తుపాకీ కొనుగోలు చేశాడని డీసీపీ వినీత్ వెల్లడించారు.
రూ.333 కోట్లు సంపాదించి ఆ తర్వాత నేరాలు మానేయాలని ప్రభాకర్ టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.ప్రభాకర్ చెస్ట్ మీద రెండు వైపులా పచ్చ బొట్లు ఉన్నాయి. కేవలం ఎనిమిదవ తరగతి వరకు చదివాడు.3 వేల రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టిన ప్రభాకర్.. ఒకేరోజు 3 లక్షలు, ఆపై 33 లక్షలు చోరీ చేయాలని టార్గెట్గా పెట్టుకుని మరీ దొంగతనాలకు పాల్పడ్డాడు. ఛాతి మీద 3 నెంబర్ టాటూ వేయించుకున్నాడు.
నార్సింగ్లోని గెటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న ప్రభాకర్.. ఒరిస్సాకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. నార్సింగిలోని అతని ఫ్లాట్లో ₹50,000 విలువైన మద్యం, జిమ్ సెటప్ మరియు ఖరీదైన గాడ్జెట్లు ఉన్నాయి.స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమే కాకుండా నెలకో కారు మారుస్తూ జల్సాలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మరోవైపు పోలీసులపై కాల్పుల కేసులో బత్తుల ప్రభాకర్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. 14 రోజుల పాటు బత్తుల ప్రభాకర్కు రిమాండ్ విధించింది కోర్టు.