Telangana Assembly Special Meeting: ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, కుల గణన నివేదికను సభ ముందు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా (Telangana Assembly Special Meeting) సమావేశం కానున్నది. కుల గణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. కుల గణనపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది
Hyderabad, FEB 01: ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా (Telangana Assembly Special Meeting) సమావేశం కానున్నది. కుల గణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. కుల గణనపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. భేటీలో ఉత్తమ్తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఆదివారం మంత్రివర్గ ఉప సంఘానికి (Cabinet Sub Committee) కుల గణన నివేదిక అందుతుందని తెలిపారు.
ఈ నెల 5న మంత్రివర్గం ముందుకు కుల గణన నివేదిక వస్తుందని చెప్పారు. కేబినెట్ ఆమోదం అనంతరం అసెంబ్లీ ముందుకు కలగణన నివేదిక తీసుకువస్తామన్నారు. ఈ నెల 5న మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుందని.. సమావేశంలో కుల గణన నివేదికను ప్రవేశపెడుతామన్నారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా విజయవంతంగా కులగణన పూర్తయ్యిందని వివరించారు.
(The above story first appeared on LatestLY on Feb 01, 2025 10:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

