TS Cabinet Meeting Today: కేసీఆర్ అధ్యక్షతన నేడు క్యాబినెట్ మీటింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో భేటీ.. 40 నుంచి 50 అంశాలపై చర్చ.. నిరుద్యోగభృతి వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Hyderabad, July 31: తెలంగాణ (Telangana) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం (Cabinet) నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (KCR) నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నది. సాగు పనులు, భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులపైనా చర్చించనున్నది. వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది.
కీలక అంశాలపై చర్చ కూడా..
ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల విస్తరణ, పెండింగ్ పనులు పూర్తి చేయడం వంటి వాటిపై కూడా క్యాబినెట్ లో చర్చించనున్నారు. గత ఎన్నికల సమయంలో నిరుద్యోగభృతి వంటి హామీలను కేసీఆర్ ఇచ్చారు. ఈనాటి సమావేశంలో వీటిపై చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోయే కొత్త హామీలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. గృహలక్ష్మి, రెండో విడత దళితబంధు, బీసీలు, మైనార్టీలకు రూ. లక్ష ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు, పంట రుణాల మాఫీ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
(The above story first appeared on LatestLY on Jul 31, 2023 09:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

