Corona in Telangana: తెలంగాణలో 90 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1863 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో, 684కు పెరిగిన కరోనా మరణాలు
COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Hyderabad, August 15:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 21,239 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,863 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 664 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,32,435 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 90,259కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 394 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 175 , రంగారెడ్డి జిల్లా నుంచి 131, మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 81 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

అలాగే కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ మరియు వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి 70కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో కూడా కరోనావైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.

ఇక రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌లు‌గా మారాయి. వీటిలో ఒకటైన వరంగల్ అర్బన్ నుంచి నిన్న 101 పాజిటివ్ కేసులు నివేదించబడగా, కరీంనగర్ నుంచి 104 మరియు అలాగే సిరిసిల్ల నుంచి 90 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఆగష్టు 14న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 10 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 684 కు పెరిగింది.

అలాగే, శుక్రవారం సాయంత్రం వరకు మరో 1912 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 66,196 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,379 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.