TS's COVID19 Bulletin: తెలంగాణలో కొత్తగా మరో 15 వందల మందికి పాజిటివ్, మరో 14 వందలకు పైగా రికవరీలు, రాష్ట్రంలో 17,979గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Screening for coronavirus | Representational image | (Photo Credits: PTI)

Hyderabad, October 29: తెలంగాణలో కొవిడ్ తీవ్రత అదుపులోకి వస్తోంది. ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య ఇటీవలి కాలంగా 2 వేలలోపే ఉంటోంది. అయితే కొవిడ్ టెస్టులు కూడా ఒకరోజు ఎక్కువగా, ఒకరోజు తక్కువగా ఉండటం గమనార్హం.

రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 41,962 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1504 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1,049 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 41,96,958 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,35,656కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 288 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 115, మేడ్చల్ నుంచి 118, నల్గొండ నుంచి 93, ఖమ్మం నుంచి 84 మరియు  కొత్తగూడెం నుంచి మరో 83 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 05 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1324కు పెరిగింది.

అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 1436 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,16,353 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,979 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది