Khairatabad Big Ganesh Darshan: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్న భారీ గణపయ్య
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు అని అధికారులు తెలిపారు. మంగళవారం ఈ భారీ గణనాథుడిని నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు.
Hyderabad, Sep 15: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు అని అధికారులు తెలిపారు. మంగళవారం ఈ భారీ గణనాథుడిని నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి గత పది రోజులుగా భక్తులకు (Khairatabad Big Ganesh Darshan) దర్శనమిస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖశక్తి మహాగణపతిగా దర్శనమిస్తున్న గణేష్ ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.
బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా, తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం
Here's Video:
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు.. మంగళవారం గంగమ్మ ఒడికి చేరనున్న గణనాథుడు.#VinayakaChavithi #KhairatabadGanesh #Hyderabd #Bigtv pic.twitter.com/A0oj6xUtBU
— BIG TV Breaking News (@bigtvtelugu) September 15, 2024
అలా 70 అడుగుల ఎత్తు
1954లో ఖైరతాబాద్ గణేషుడి ప్రస్థానం ప్రారంభమైంది. గణపతి ప్రతిష్టించడం ఈ ఏడాదికి 70 ఏండ్లు. దీన్ని పురస్కరించుకొని 70 అడుగుల ఎత్తులో పూర్తిగా పర్యావరణ హితమైన మట్టి గణపతిని నిర్వాహకులు తీర్చిదిద్దారు.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
(The above story first appeared on LatestLY on Aug 17, 5911 05:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

