TRS Mps Protest: ఏపీ విభజనపై ప్రధాని వ్యాఖ్యలు, ఉభయ సభల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌, ప్రధానిపై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చిన ఎంపీలు

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. సాయంత్రం 4 గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. వెల్‌లోకి దూసుకువెళ్లి నిర‌స‌న (TRS Mps Protest) చేప‌ట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని మోదీ రెండు రోజుల క్రితం అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు (Telangana formation remark ) చేసిన విష‌యం తెలిసిందే.

TRS Mps Protest: ఏపీ విభజనపై ప్రధాని వ్యాఖ్యలు, ఉభయ సభల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌, ప్రధానిపై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చిన ఎంపీలు
TRS MPs move Privilege Motion against PM over Telangana formation remark (Photo-Video Grab)

New Delhi, Feb10: తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. సాయంత్రం 4 గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. వెల్‌లోకి దూసుకువెళ్లి నిర‌స‌న (TRS Mps Protest) చేప‌ట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని మోదీ రెండు రోజుల క్రితం అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు (Telangana formation remark ) చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీపై టీఆర్ఎస్ పార్టీ స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చింది. లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాతో పాటు లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు ఆ నోటీసులు అంద‌జేశారు. ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు ప్ల‌కార్డుల‌తో వెల్‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. నామా నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో లోక్‌స‌భ ఎంపీలు ఆందోళ‌న నిర్వ‌హించారు.

ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు గాను రాజ్యసభ టీఆర్‌ఎస్ ఎంపీలు గురువారం ప్రత్యేకాధికారుల నోటీసు ఇచ్చారు, ఈ అంశాన్ని లేవనెత్తడానికి సభాపతి అనుమతించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ను ఉద్దేశించి పంపిన నోటీసును గురువారం ఉదయం హౌస్ సెక్రటరీ జనరల్‌కు సమర్పించారు. ప్రివిలేజ్ నోటీసుపై (TRS MPs move Privilege Motion ) తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎంపీలు కే కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, కేఆర్ సురేష్ రెడ్డి, బీ లింగయ్య యాదవ్ సంతకాలు చేశారు. అయితే ప్రివిలేజ్ నోటీసుపై చైర్మెన్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని డిప్యూటీ చైర్మెన్ హ‌రివంశ్ తెలిపారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలు కలకలం, పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీల నిర‌స‌న‌

కాగా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రత్యుత్తరం ఇస్తూ, తెలంగాణ ఏర్పడిన విధానాన్ని మోదీ రాజ్యసభలో ప్రస్తావించారు. 'ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తీరు సిగ్గులేని విధానం.. మైకులు మూయించి, మిర్చి చల్లారు, బిల్లుపై చర్చ జరగలేదు. ఈ పద్ధతి సరైనదేనా? ఇది ప్రజాస్వామ్యమా' అని ఆయన ప్రశ్నించారు. నేటికీ ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై నిరసనలు వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలోఎంపీ కేశవ రావు దీనిపై వెంటనే చర్చ జరగాలని పట్టుబట్టారు. అయితే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అనుమతించలేదు, ఈ రోజు నోటీసు వచ్చిందని, చైర్మన్ పిలుస్తారని చెప్పారు.

జీరో అవర్ ప్రారంభమైన వెంటనే, రావు ఈ విషయాన్ని లేవనెత్తాలని కోరుతూ లేచి నిలబడ్డారు. ఇతర టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రధాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వెల్‌లోకి దూసుకువెళ్లారు. జీరో అవర్‌లో టిఆర్ఎస్ నాయకుడిని మాట్లాడనివ్వలేదు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసనగా వాకౌట్‌ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా వారికి అనుకూలంగా మాట్లాడి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే ఈ అంశంపై మాట్లాడేందుకు సభాపతి అనుమతించలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదంపై రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా ఫిబ్రవరి 8న రాజ్యసభలో చేసిన ప్రకటనపై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రూల్ 187 కింద ప్రివిలేజ్ మోషన్ తీసుకురావాలనుకుంటున్నామని టీఆర్‌ఎస్ ఎంపీలు నోటీసులో పంపారు.

(The above story first appeared on LatestLY on Feb 10, 2022 05:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).