Wines Closed in Telangana: హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా ఈ వారంలో 3 రోజులు వైన్స్, బార్లు బంద్.. ఎందుకంటే??
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.
Hyderabad, Nov 26: అసెంబ్లీ ఎన్నికలను (Assembly Elections) దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు (Wine Shops), బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటల్స్, పబ్బులు, క్లబ్బుల్లో కూడా మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కూడా దాదాపుగా ఇవే నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఓట్ల లెక్కింపు రోజు ఇలా..
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో డిసెంబర్ 3న ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు ట్రై కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Nov 26, 2023 09:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

