Earthquake in Turkey: టర్కీలో 3 నెలల పాటు అత్యవసర పరిస్థితి, 10 దక్షిణ ప్రావిన్సులలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, దాదాపు 5 వేల మందిని బలిగొన్న భయంకరమైన భూకంపాలు
Earthquake in Turkey. (Photo Credits: Twitter)

అంకారా [టర్కీ], ఫిబ్రవరి 7: టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం వల్ల దాదాపు 5000 మందికి పైగా మరణించారు. శతాబ్దపు అత్యంత బలమైన భూకంపాలలో ఒకటిగా భావిస్తున్న ఈ భూకంపం కారణంగా చుట్టుపక్కల భారీ ప్రకంపనలు (Earthquake in Turkey) సంభవించాయి. ప్రజలు అల్లాడిపోయారు. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తుల భయానక చిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.

భారీ భూకంపాలతో దెబ్బతిన్న 10 దక్షిణ ప్రావిన్సులలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ (Turkish President Recep Tayyip Erdogan) మంగళవారం మూడు నెలల అత్యవసర పరిస్థితిని (Three-Month State of Emergency ) ప్రకటించారు. రాజధాని అంకారాలోని స్టేట్ ఇన్ఫర్మేషన్ కోఆర్డినేషన్ సెంటర్‌లో ఎర్డోగాన్ ప్రసంగిస్తూ, "రాజ్యాంగంలోని ఆర్టికల్ 119 ద్వారా మాకు ఇచ్చిన అధికారం ఆధారంగా, మేము అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

టర్కీ భూకంపంలో గుండెలు పిండేస్తున్న ఫోటో, తమ్ముడిని కాపాడుకునేందుకు అమ్మలా మారిన పదేళ్ల చిన్నారి, తలకు చేయి అడ్డుపెట్టి..

"మేము అత్యవసర నిర్ణయం గురించి అధ్యక్ష, పార్లమెంటరీ ప్రక్రియలను త్వరగా పూర్తి చేస్తాము, ఇది భూకంపాలు సంభవించిన 10 ప్రావిన్సులను కవర్ చేస్తుంది. మూడు నెలల పాటు కొనసాగుతుంది" అని చెప్పారు. కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లోని పజార్సిక్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఎర్డోగన్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

ఆ తర్వాత దాదాపు తొమ్మిది గంటల తర్వాత, కహ్రామన్‌మారాస్‌లోని ఎల్బిస్తాన్ జిల్లాలో 7.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది, ఈ ప్రాంతాన్ని కుదిపేసింది. సిరియా, లెబనాన్‌తో సహా పలు దేశాల్లో కూడా భూకంపం సంభవించింది.మేము టర్కీ రిపబ్లిక్ చరిత్రలోనే కాకుండా మన భౌగోళికం, ప్రపంచం యొక్క అతిపెద్ద విపత్తులలో ఒకదాన్ని ఎదుర్కొంటున్నాము" అని ఎర్డోగాన్ అన్నారు.రెండు బలమైన భూకంపాల కారణంగా 10 ప్రావిన్సుల్లో కనీసం 3,549 మంది మరణించారు. 22,168 మంది గాయపడ్డారు.ఉపశమనం ఏంటంటే.. ఇప్పటివరకు 8,000 మంది పౌరులను అధికారులు శిథిలాల నుండి రక్షించారు అని ఎర్డోగాన్ చెప్పారు.

బుగ్గల నిండా రక్తంతో కాపాడండి అంటూ కెమెరావైపు దీనంగా చూస్తున్న చిన్నారి, టర్కీ భూకంపంలో విషాదకర వీడియో బయటకు..

రెండు భూకంపాలు భూమిపై 7 కిలోమీటర్ల దూరంలో సంభవించాయి. ఇది విధ్వంసం యొక్క తీవ్రతను పెంచింది.5,000 మంది వ్యక్తుల ప్రాణాలను ఈ భూకంపం బలిగొంది. శోధన, రెస్క్యూ బృందాలను పంపినందుకు టర్కీ భారతదేశాన్ని అభినందిస్తున్నామని ఎర్డోగాన్ తెలిపారు.

10 నగరాలకు విస్తరించిన భూకంపం యొక్క విధ్వంసక ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని, ఎర్డోగాన్ దేశం నలుమూలల నుండి నిపుణులైన సిబ్బందిని, వాహనాలను వెంటనే ఈ ప్రాంతానికి తరలించాలని ఆదేశించామని, వాతావరణ పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ, రెస్క్యూ టీం నిస్వార్థంగా పోరాడుతున్నాయని తెలిపారు.అంతకుముందు, టర్కీ ఏడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది.