Pakistan: పాకిస్తాన్‌లో దారుణం, హిందూ యువతిని కాల్చివేసిన దుండుగుడు, కిడ్నాప్ ప్రయత్నాన్ని యువతి ప్రతిఘటించడంతో కాల్పులకు తెగబడిన అగంతకుడు
Image used for representation purpose only | Photo: PTI

Sindh, Mar 22: పాకిస్థాన్‌ దేశంలో మరో ఘోరమైన దారుణం వెలుగుచూసింది. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో 18 ఏళ్ల హిందూ యువతి పూజా ఓడ్ ని దుండగుడు (18-year-old Hindu Girl Pooja Oad Shot Dead) కాల్చి చంపారు.రోహి పట్టణంలోని సుక్కూర్‌లో హిందూ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు వీధిలో కాల్చి చంపారు. ఆమెను అపహరించే ప్రయత్నంలో ప్రతిఘటించినందుకు (Abduction Attempt In Sindh Province) ఆమెను దారుణంగా కాల్చి చంపారు. పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రాంతంలో మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన పలువురు మహిళలను తీవ్రవాదులు అపహరించి, బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారు.

పాకిస్తానీ రిపోర్టర్ మరియు వ్యాఖ్యాత నైలా ఇనాయత్ ప్రకారం, పూజా ఓడ్‌ను అపహరించడానికి ప్రయత్నించిన వాహిద్ లాషారీ ప్రయత్నాన్ని ఆమె ప్రతిఘటించడంతో కాల్చి చంపారని ట్వీట్ చేసింది. పాకిస్థాన్‌లోని మైనారిటీ వర్గాలు చాలా కాలంగా ఇలా బలవంతపు వివాహాలు, మతమార్పిడులు చేస్తున్నారు.2013నుంచి 2019 సంవత్సరాల మధ్యకాలంలో 156 బలవంతపు మతమార్పిడుల సంఘటనలు జరిగాయని పీపుల్స్ కమిషన్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ పేర్కొంది.

ఢిల్లీ నుంచి దోహాకు వెళుతున్న విమానంలో పొగలు, అత్యవసరంగా కరాచీలో సురక్షితంగా ల్యాండ్, ప్రయాణికులకు సారీ చెప్పిన ఖతార్ ఎయిర్ వేస్

పాకిస్థాన్ దేశంలో హిందువుల జనాభా శాతం 1.60 శాతం ఉంది. కాగా సింధ్ ప్రాంతంలో అత్యధికంగా హిందూ జనాభా 6.51 శాతం మంది ఉన్నారు. పాకిస్థాన్ దేశంలో 90 లక్షలమంది ఉన్న హిందువుల జనాభా కొందరు తరచూ తీవ్రవాదుల వేధింపులపై ఫిర్యాదులు చేస్తుంటారు.

Here's ANI, Naila Inayat Tweets

పాకిస్తాన్‌లోని మైనారిటీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన మరో దాడిలో, 18 ఏళ్ల పూజా ఓడ్ అనే బాలిక, ఆమెను అపహరించే ప్రయత్నాలను ప్రతిఘటించినందుకు సింధ్ జిల్లాలోని వీధిలో కాల్చి చంపబడింది, శుక్రవారం టైమ్స్ నివేదించింది. పూజా ఓడ్, అపహరణ ప్రయత్నాన్ని ప్రతిఘటించడంతో రోహి, సుక్కూర్‌లో కాల్చి చంపబడింది.