Vibrio vulnificus: అమెరికాను వణికిస్తున్న విబ్రియో వల్నిఫికస్‌ అనే కొత్త బ్యాక్టీరియా, ఇది సోకితే ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోయే ప్రమాదం

అమెరికాను కొత్త రకం బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరంగా మారింది. వ్యాధి సోకిన ఐదుగురిలో ఒకరిని చంపే "మాంసాన్ని తినే బ్యాక్టీరియా" US తూర్పు తీరం అంతటా వేగంగా వ్యాపిస్తుంది. ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నందున ప్రసిద్ధ బీచ్‌లలోకి ఈ బ్యాక్టీరియా చొరబడుతోంది.దీన్ని విబ్రియో వల్నిఫికస్‌గా పిలుస్తున్నారు.

Vibrio vulnificus: అమెరికాను వణికిస్తున్న విబ్రియో వల్నిఫికస్‌ అనే కొత్త బ్యాక్టీరియా, ఇది సోకితే ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోయే ప్రమాదం
Vibrio vulnificus (Representative image)

New York, April 12: అమెరికాను కొత్త రకం బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరంగా మారింది. వ్యాధి సోకిన ఐదుగురిలో ఒకరిని చంపే "మాంసాన్ని తినే బ్యాక్టీరియా" US తూర్పు తీరం అంతటా వేగంగా వ్యాపిస్తుంది. ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నందున ప్రసిద్ధ బీచ్‌లలోకి ఈ బ్యాక్టీరియా చొరబడుతోంది.దీన్ని విబ్రియో వల్నిఫికస్‌గా పిలుస్తున్నారు.

ఈ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరం.. మానవ కణజాలాన్ని క్రమంగా తినేస్తుంది. దీంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఇటీవల కాలంలో ఈ కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. శరీరానికి తగిలిన గాయాలపై విబ్రియో వల్నిఫికస్‌ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. నెమ్మదిగా అక్కడి కణజాలాన్ని తింటూ ఆ గాయాలను పెద్దవి చేస్తుంది. దీంతో కొన్నిసార్లు బాధితులను ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఈ వ్యాధి సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోయే ప్రమాదముందని సీడీసీ వెల్లడించింది.

ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ChaosGPT, ఈ భూగ్రహాన్ని అంతం చేయడమే దాని లక్ష్యం, అసలు ChaosGPT అంటే ఏమిటి ఓ సారి తెలుసుకుందాం

ఈ అరుదైన బ్యాక్టీరియా 'విబ్రియో వల్నిఫికస్', సాధారణంగా 64C కంటే ఎక్కువ వెచ్చని నిస్సార నీటిలో ఉంటుంది. ఫ్లోరిడాలో గత ఏడాది 65 కేసులు నమోదయ్యాయి, ఇది గత మూడు దశాబ్దాలుగా సంవత్సరానికి 10 నుండి 80 వరకు పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్‌లతో అమెరికాను వణికిస్తోంది. Nature.comలో జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం USలో 1,100 మంది బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్లు సోకగా 159 మంది మరణించారు.1988 నుంచి 2016 మధ్య USAలో 1,100 గాయాలు ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. వీరిలో 159 మంది మరణించారు.

దేశంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా, ఫోర్త్ వేవ్ వచ్చేసిందా, పెరుగుతున్న కేసులతో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో భారత్, మరి నిపుణులు ఏమంటున్నారు ?

Nature.comలో ఇటీవల ప్రచురించబడిన శాస్త్రీయ పత్రం ప్రకారం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల ఫలితంగా ఈ బ్యాక్టీరియా కేసులు మసాచుసెట్స్‌కు చేరుకుంటున్నాయి. వచ్చే దశాబ్దంలో న్యూయార్క్‌కు మరింతగా విస్తరించవచ్చని తెలిపింది. వయసు మళ్లిన వారిపైనే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, రానున్న రోజుల్లో వార్షిక కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశముందని మెట్రో తెలిపింది.

ఈ బ్యాక్టీరియా సోకితే నీటి విరేచనాలతో పాటు పొత్తికడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, జ్వరం, చలికి వంటి లక్షణాలు కనిపిస్తాయి. బాక్టీరియా ఉన్నవారిలో 18% మంది మాంసాన్ని తినే వైరస్‌తో మరణిస్తున్నందున ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. ప్రతి సంవత్సరం 80,000 మంది అమెరికన్లు బ్యాక్టీరియా బారిన పడుతున్నారని అంచనా. అయితే, ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా. కొన్ని విబ్రియో వల్నిఫికస్ ఇన్పెక్షన్లు నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌కు దారితీస్తాయి. అంటే, గాయం చుట్టూ ఉన్న కణజాలాన్ని ఈ బ్యాక్టీరియా తినేస్తుంది. ఫలితంగా గాయం మరింత ముదిరిపోయి ప్రాణహాని కలిగే అవకాశముంది.’’ అని సీడీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

సాధారణ, శీతల వాతావరణ పరిస్థితుల్లో ఈ బ్యాక్టీరియా మనుగడ సాగించలేదని సీడీసీ పేర్కొంది. వేడి ఎక్కువైతే మాత్రం ఇది మరింత చురుగ్గా వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది. వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటే తూర్పు తీర ప్రాంతానికి దాదాపు 1000 కిలోమీటర్ల వరకు ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని తెలిపింది.

(The above story first appeared on LatestLY on Apr 12, 2023 10:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).