CH Shetty as SBI Chairman: ఎస్బీఐ చైర్మన్ గా తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి.. ఎంపిక చేసిన ఎఫ్ఎస్ఐబీ
భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్ గా ఉమ్మడి పాలమూరుకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్ శెట్టి) ఎంపికయ్యారు. ప్రస్తుత ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టిని చైర్మన్గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారస్ చేసింది.
Newdelhi, June 30: భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్ (SBI Chairman) గా ఉమ్మడి పాలమూరుకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్ శెట్టి) (CH Shetty) ఎంపికయ్యారు. ప్రస్తుత ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టిని చైర్మన్గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారస్ చేసింది. ప్రస్తుతం సంస్థ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా ఈ ఏఢాది ఆగస్టు 28న పదవీ విరమణ చేయబోతున్నారు.
ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి!.. కేంద్రానికి తెలుగువ్యక్తి పేరు సిఫారసుhttps://t.co/0lVPiX5GxO#SBI #Chairman #sreenivasulu
— Sakshi (@sakshinews) June 29, 2024
ఎవరీ శెట్టి?
బోగులాంబ గద్వాల్ జిల్లాలోని మానవపాడు మండలంలోని పెద్ద పోతులపాడు గ్రామంలో శెట్టి పదో తరగతి వరకూ చదువుకున్నారు. ఆ తరువాత గద్వాల్ లో ఉన్నత చదువులు చదివారు. రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీలో నుంచి బీఏ అగ్రికల్చర్లో పట్టా పొందారు. ఎస్బీఐలో 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయిలో కెరీయర్ ప్రారంభించిన శెట్టి, బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నది.
భారత్ విశ్వవిజేతగా నిలిచిన శుభవేళ.. బార్బడోస్ మైదానంలోని గరికను తిన్న రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో
(The above story first appeared on LatestLY on Jun 30, 2024 10:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

