Pavitra Lokesh On Trolling: ట్రోలింగ్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి పవిత్రా లోకేశ్.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నరేశ్, పవిత్రా లోకేష్ లపై ఇటీవల సోషల్ మీడియాలో పెద్దయెత్తున ట్రోలింగ్
సీనియర్ నటుడు నరేశ్, దక్షిణాది క్యారెక్టర్ నటి పవిత్రా లోకేశ్ కు ముడిపెడుతూ తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ పెళ్లి అని, సహజీవనం చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దీంతో ట్రోలింగ్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు నటి పవిత్రా లోకేశ్ ఫిర్యాదు చేశారు.
Hyderabad, Nov 27: సీనియర్ నటుడు నరేశ్ (Naresh), దక్షిణాది క్యారెక్టర్ నటి పవిత్రా లోకేశ్ (Pavitra Lokesh)కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో (Social Media) ఇటీవల తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ పెళ్లి (Marriage) అని, సహజీవనం (Living Relationship) చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దాంతో పవిత్రా లోకేశ్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ (Trolling) జరుగుతోంది.
దీనిపై పవిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్ల ట్రోలింగ్ కు పాల్పడుతున్న వారిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పట్ల వస్తున్న కథనాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా చానళ్లు, వెబ్ సైట్లు, యూట్యూబ్ చానళ్ళు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని పవిత్ర ఆరోపించారు.
తన ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారని, వాటిని వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
(The above story first appeared on LatestLY on Nov 27, 2022 10:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

