Yatra2 Trailer Video: ఇచ్చిన మాట కోసం యుద్ధానికైనా సిద్ధం అంటూ యాత్ర 2 సినిమా ట్రైలర్ విడుదల..వీడియో ఇక్కడ క్లిక్ చూడండి..
Yatra 2 (Photo-X)

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మరికొద్ది నెలల్లోనే సమయం ఉండడంతో ఏపీ రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. 2019లో తరహాలోనే, 2024లో కూడా సినిమాలతో ప్రభావితం చేసేందుకు టాలీవుడ్‌ నిర్మాతలు రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలతో విడుదలకు సిద్ధం అవుతున్నారు. ఆ కోవలోకే వస్తున్న చిత్రాల్లో దర్శకుడు మహి వి.రాఘవ్‌ రూపొందించిన యాత్ర 2 ఒకటి. ఈ చిత్రం ఫిబ్రవరి 8, 2024న విడుదల కానుంది మేకర్స్ ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేశారు. “యాత్ర” మొదటి భాగం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై దృష్టి పెట్టగా,  రెండవ భాగం ట్రైలర్‌లో  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రాబల్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదగడంపై కథను దృష్టి పెట్టారు. తన తండ్రి మరణంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రారంభించేందుకు ప్రేరేపించిన అంశాలతో పాటు ఆయన తన యాత్రను కొనసాగించకుండా అడ్డుకునేందుకు ఆయన వెనుక జరిగిన కుట్రలను వివరిస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ట్రైలర్ ప్రకారం, ఈ చిత్రం అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును విలన్లుగా చిత్రీకరించారు.  సినిమాలోని ప్రధాన నటులకు బదులుగా సన్నివేశాల మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్‌ల వాస్తవ చిత్రాలను ఉపయోగించడం గమనార్హం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా తమిళ నటుడు జీవా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన “యాత్ర 2” 2009 నుండి 2019 వరకు జరిగిన రాజకీయ పరిణామాలను అనుసరిస్తుంది.  యాత్ర 2 చిత్రాన్ని త్రీ ఆటం లీవ్స్ మరియు వి సెల్యులాయిడ్ బ్యానర్‌పై శివ మేక నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.