Bharat Bandh: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ భారత్ బంద్, పిలుపునిచ్చిన భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్, బీజేపీ హిందూ రాష్ట్ర కల ఎప్పటికీ నెరవేరదన్న చంద్రశేఖర్ ఆజాద్
ప్రభుత్వఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల అమలు రాష్ట్రాల ఇష్టమని ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. అయితే ఈ విషయంపై పలు సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ (Bhim Army Chief Chandrashekhar Azad) ఫిబ్రవరి భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
New Delhi, February 22: ప్రభుత్వఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల అమలు రాష్ట్రాల ఇష్టమని ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. అయితే ఈ విషయంపై పలు సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ (Bhim Army Chief Chandrashekhar Azad) ఫిబ్రవరి 23న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
నియామకాలలో , ప్రమోషన్లలో రిజర్వేషన్లు పొందటానికి ప్రాథమిక హక్కు లేదని, రాష్ట్రాలు రిజర్వేషన్లు (SC/ST Quota, SC/ST Reservation) ఇవ్వడానికి కట్టుబడి ఉండవని సుప్రీంకోర్టు చేసిన వాదనకు నిరసనగా దేశవ్యాప్తంగా షట్ డౌన్ చేయాలని చంద్రశేఖర్ ఆజాద్ పిలుపునిచ్చారు.
ఆజాద్ ఇచ్చిన 'భారత్ బంద్' పిలుపుకు పలు సామాజిక, రాజకీయ సంస్థలు తమ మద్దతు ప్రకటించాయి. ఈ నెల ప్రారంభంలో, సుప్రీంకోర్టు "పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందటానికి ఒక వ్యక్తికి అంతర్లీనంగా ఉండే ప్రాథమిక హక్కు లేదు" అని పేర్కొంది. "ఈ న్యాయస్థానం నిర్దేశించిన చట్టం దృష్ట్యా, రిజర్వేషన్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండదు. అలాగే రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోర్టు ఎటువంటి మాండమస్ జారీ చేయదు" అని ఎల్ నాగేశ్వర రావు, హేమంత్ గుప్తాన్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
నియోజకవర్గాల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడగిస్తూ కేంద్ర కేబినేట్ నిర్ణయం
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఓబిసిలకు రిజర్వేషన్లను అంతం చేసే దిశగా ఇది ఉందని కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. సుప్రీం కోర్టు పరిశీలన తరువాత, ఈ తీర్పును రద్దు చేయడానికి ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి 'భారత్ బంద్' కు పిలుపునిచ్చారు.
బీహార్లో, లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క ఆర్జేడీ ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పి), జితాన్ రామ్ మంజి యొక్క హిందూస్థానీ అవామి మోర్చా, మరియు పప్పు యాదవ్ యొక్క జన అధికార్ పార్టీ తమ మద్దతును అందించాయి.
నిరసనకు ముందు ఆజాద్ మాట్లాడుతూ "హిందూ రాష్ట్రం" కల ఎప్పటికీ నెరవేరదు. "భారత్ బంద్ తో, ఆర్ఎస్ఎస్ మరియు బిజెపి హిందూ రాష్ట్రాలను తయారు చేయడంలో ఎప్పటికీ విజయవంతం కావు అనే సందేశాన్ని పంపాలని ఆజాద్ కోరారు. అంబేద్కర్ కలని భారతదేశంగా మారుస్తాము" అని ఆజాద్ ట్వీట్ చేశారు.
దీనికి సమాధానంగా సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తవర్చంద్ గెహ్లాట్ పార్లమెంటుకు కేంద్రం ఎస్సీల పార్టీ కాదని, 2012 లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అత్యున్నత కోర్టు ఉత్తర్వులను ఇచ్చిందని తెలిపారు.
(The above story first appeared on LatestLY on Feb 22, 2020 10:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

