UPSC IAS Final Results 2022 Declared: యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ 2022 ఫలితాలు విడుదల, ఆలిండియా టాపర్‌గా నిలిచిన ఇషితా కిషోర్‌
Representational Picture. Credits: PTI

UPSC నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ – 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వారిలో ఇషితా కిషోర్‌ అనే యువతి ఆలిండియా టాపర్‌గా నిలిచారు. ఈసారి మొదటి నాలుగు ర్యాంకులను మహిళలే సొంతం చేసుకున్నారు. టాపర్‌గా ఇషిత నిలువగా.. గరిమా లోహియా, ఉమా హారతి ఎన్‌, స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకుల్లో ఉన్నారు. ఫలితాలను upsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచు.

రూ.90 వేలకు పైగా జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు, మూడు విభాగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ, పూర్తి వివరాలు ఇవిగో..

ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (IAS), ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (IFS), ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (IPS) తోపాటు గ్రూప్‌ A, గ్రూప్‌ B కేటగిరీలకు చెందిన కేంద్ర సర్వీసులలో నియమకాల కోసం UPSC గత ఏడాది సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్టు కోసం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూ చేసింది.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త, NPCIL 129 పోస్టులను రిక్రూట్ చేస్తుంది, అర్హత ఏంటో తెలుసుకోండి

ఫైనల్‌గా 933 మందిని వేర్వేరు సర్వీసులకు ఎంపిక చేసింది. మొత్తం 345 మంది జనరల్‌ కోటాలో ర్యాంకులు సాధించారు. ఇక 99 మంది EWS కోటాలో, 263 మంది OBC కోటాలో, 154 మంది SC కోటాలో, 72 మంది ST కోటాలో 2022 సివిల్‌ సర్వీసులకు ఎంపికయ్యారు.