Schedule for Assembly Polls Today: మోగనున్న ఎన్నికల నగారా... పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోనే దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ ను నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

Schedule for Assembly Polls Today: మోగనున్న ఎన్నికల నగారా... పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ
Election Commission (photo-ANI)

Newdelhi, Aug 16: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోనే దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) సంబంధించిన షెడ్యూల్‌ ను నేడు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రకటించనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఏ రాష్ట్రాల షెడ్యూల్ విడుదల చేయనుందో ప్రకటనలో వెల్లడించలేదు.

హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చ, ఆపిల్- ఫాక్స్ కాన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ, పూర్తి వివరాలివే..

ఏ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగొచ్చు అంటే?

హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల షెడ్యూల్‌ వెలువడనున్నట్లు సమాచారం. నవంబర్‌ నెలతో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగియనుంది. జార్ఖండ్ చట్టసభ పదవీకాలం జనవరితో ముగియనుంది. దీంతో ఈ మూడు రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల కానుందని సమాచారం. అలాగే జమ్మూకశ్మీర్‌ లో శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దాంతో ఇక్కడ ఎన్నికల తేదీని కూడా ప్రకటించొచ్చని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ బిల్డప్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన కేటీఆర్, నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఎలా అంటూ సూటి ప్రశ్న

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).