
Hyderabad, July 29: ఈ నెల 31 నుంచి వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లను (MMTS Trains) రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే శాఖ (South Central Railway) శుక్రవారం ప్రకటించింది. రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతులు నేపథ్యంలో సర్వీసులు రద్దు చేసినట్టు తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 12 ఎంఎంటీఎస్ రైళ్లు, ఉందానగర్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి మధ్య 10 సర్వీసులను రద్దు చేసినట్టు వెల్లడించింది.
