Big Relief For Consumers: సామాన్యులకు ఊరట.. దిగొస్తున్న వంటనూనె ధరలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా భారత్‌కు నిలిచిపోయిన నూనెల సరఫరా.. మళ్లీ ప్రారంభం.. దీంతో రిటైల్ మార్కెట్లో ధర ఎంతవరకు తగ్గనున్నదంటే??

నిరుడు సామాన్యులను బెంబేలెత్తించిన వంటనూనె ధరలు తగ్గుముఖం పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య గతేడాది యుద్ధం మొదలవ్వడంతో అప్పట్లో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోవడంతో ధరలు కొండెక్కాయి. అయితే, మళ్లీ ఇప్పుడు సరఫరా ప్రారంభం కావడంతో భారత్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీర్ ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి.

Big Relief For Consumers: సామాన్యులకు ఊరట.. దిగొస్తున్న వంటనూనె ధరలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా భారత్‌కు నిలిచిపోయిన నూనెల సరఫరా.. మళ్లీ ప్రారంభం.. దీంతో రిటైల్ మార్కెట్లో ధర ఎంతవరకు తగ్గనున్నదంటే??
Representative Image

Newdelhi, May 8: నిరుడు సామాన్యులను (Middle Class Consumers) బెంబేలెత్తించిన వంటనూనె (Cooking Oil) ధరలు (Prices) తగ్గుముఖం పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ (Russia- Ukraine) మధ్య గతేడాది యుద్ధం మొదలవ్వడంతో అప్పట్లో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోవడంతో ధరలు కొండెక్కాయి. అయితే, మళ్లీ ఇప్పుడు సరఫరా ప్రారంభం కావడంతో భారత్‌లో  సన్‌ఫ్లవర్, సోయాబీర్ ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ధరలు  46 నుంచి 57 శాతం వరకు తగ్గాయి. ఈ తగ్గుదల రిటైల్ మార్కెట్లో  మాత్రం 16-17 శాతంగానే ఉండనుంది. కాగా, వంటనూనెల ధరలను తగ్గించాలని కంపెనీలకు ఇటీవలే కేంద్రం సూచించడం తెలిసిందే.

Kerala Boat Capsized Update: కేరళ బోటు ప్రమాద ఘటన.. 21 కి చేరిన మృతులు.. విహార యాత్రకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న పర్యాటకులు.. రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ప్రధాని

మరికొంత సమయం

ఉక్రెయిన్ నుంచి దిగుమతులు పెరగడంతో నిల్వలు కూడా అదే స్థాయిలో పెరగడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టినట్టు ఎస్ఈఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. అయితే, రిటైల్ మార్కెట్లో తగ్గిన ధరలు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Kerala Boat Capsized: కేరళలో ఘోర ప్రమాదం, టూరిస్ట్ బోల్తా పడి 15 మందికి పైగా మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

(The above story first appeared on LatestLY on May 08, 2023 08:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).