
Hyderabad, May 21: తెలంగాణ (Telangana) రైతన్నలకు (Farmers) శుభవార్త. జూన్ 5 - 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు (Monsoon) ప్రవేశించనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది. తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి అయిదారు రోజుల సమయం పడుతుంది. ఈసారి నైరుతి గమనం సానుకూలంగానే ఉండబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది కేరళను జూన్ 11న తాకిన రుతుపవనాలు తెలంగాణలో 20నాటికి విస్తరించిన విషయం తెలిసిందే.
IMD: జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు!
నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి 11 మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాల గమనం సానుకూలంగా ఉందని అధికారులు వివరించారు.https://t.co/MAaAeKol6V#telangana #monsoon #june…
— RTV (@RTVnewsnetwork) May 21, 2024
కారణం ఇదే?
ఈసారి నైరుతి గమనం సానుకూలంగా ఉండటానికి కారణం.. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండటమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.