Cyclone Remal: తీవ్ర తుపానుగా మారిన రెమాల్.. ఈ రాత్రి బెంగాల్ తీరం దాటే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్ గా మారింది. నేటి అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
Newdelhi, May 26: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన రెమాల్ తుపాన్ (Cyclone Remal) బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్ గా మారింది. నేటి అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్ (West Bengal) వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, అండమాన్ నికోబర్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
#CycloneRemal Takes Shape Of Severe Cyclonic Storm, Landfall At Midnight; Heavy Rain & Squall To Hit #Odisha #Odishabytes #odishabytesnews https://t.co/cXdoAIqk66
— Odisha Bytes News (@BytesOdisha) May 26, 2024
మత్స్యకారులకు అలర్ట్
తెలంగాణ, ఏపీపై తుపాను ప్రభావం లేకపోయినప్పటికీ.. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని చెప్పింది.
ఢిల్లీలో ఘోరం.. అర్ధరాత్రి పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి (వీడియో)
(The above story first appeared on LatestLY on May 26, 2024 10:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

