SC on Bulldozer Action: అక్టోబరు ఒకటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, బుల్డోజర్ న్యాయంపై కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసే(Bulldozer Justice) ప్రక్రియకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. బుల్డోజర్ వినియోగంపై మళ్లీ వాదనలు చేపట్టే వరకు ఆ చర్యలను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
New Delhi, Sep 17: అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసే(Bulldozer Justice) ప్రక్రియకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. బుల్డోజర్ వినియోగంపై మళ్లీ వాదనలు చేపట్టే వరకు ఆ చర్యలను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది.
అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని తప్పుపడుతూ ఇటీవల సుప్రీంకోర్టు పలుమార్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని గొప్పగా చిత్రీకరించడాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఎన్నికల సంఘానికి కూడా వార్నింగ్ ఇచ్చింది. రోడ్లు, రైల్వే ట్రాక్లు, చెరువుల్లో జరిగిన ఆక్రమణల విషయంలో తమ తీర్పు వర్తించదని కోర్టు చెప్పింది.
(The above story first appeared on LatestLY on Sep 17, 2024 04:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

