Indo-Pak Clash: భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న 300 మంది ఉగ్రవాదులు, మన భద్రతా దళాలు అడ్డుకుంటున్నాయని తెలిపిన బిఎస్ఎఫ్ ఐజి రాజేష్ మిశ్రా
Srinagar, Rajesh Mishra, BSF Inspector General (IG), Kashmir, Pakistan, border, terrorists, ceasefire violations, Indian Army, Gurez sector, soldiers, Indo-Pak clash at LoC, pad of Pakistan, Border Security Force, terrorists in Pak launchpads
Srinagar, Nov 16: పాకిస్తాన్లోని ప్రతి లాంచింగ్ ప్యాడ్ వద్ద (launching pad of Pakistan) సరిహద్దులో 250-300 మంది ఉగ్రవాదులు (Around 300 terrorists) ఉన్నారని కాశ్మీర్ బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) రాజేష్ మిశ్రా (BSF Inspector General (IG) Rajesh Mishra) చెప్పారు. వారంతా అక్కడి నుంచి ఇండియాలోకి ప్రవేశించేందుకు ఎదురుచూస్తున్నారని బీఎస్ఎఫ్ ఐజీ చెప్పారు. అయితే అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న వారిని మన దళాలు (Indian Army) అడ్డుకుంటున్నట్లు రాజేశ్ మిశ్రా తెలిపారు. శుక్రవారం రోజున పాక్ దళాలు .. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిన విషయం తెలిసిందే.
భారీ ఆయుధాలతో పాక్ దళాలు భారత్ వైపు ఫైరింగ్ జరిపాయి. ఆ కాల్పుల్లో భారత్కు భారీ ఆస్తి నష్టమే జరిగినట్లు బీఎస్ఎఫ్ ఆఫీసర్ చెప్పారు. గురేజ్, యురి సెక్టార్ల మధ్యలో జరిగిన కాల్పుల్లో సుమారు 11 మంది మరణించారు. దాంట్లో అయిదుగురు జవాన్లు కూడా ఉన్నారు. భారత్ కూడా భారీ ఎత్తున ఫైరింగ్ జరిపింది. ఆ కాల్పుల్లో పాక్ ఆర్మీ కేంద్రాలు ధ్వంసం అయ్యాయి.
నవంబర్ 13 న పాకిస్తాన్ చేసిన బహుళ కాల్పుల విరమణ ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజానికి తనకు ఏదైనా సందేశం ఉందా అని అడిగినప్పుడు, "వారి ఆస్తులకు నష్టం కలిగించడం సహా పౌరులపై చాలా హాని జరిగింది. మానవ హక్కుల ఉల్లంఘన సమస్యను లేవనెత్తాలి" అని బిఎస్ఎఫ్ ఐజి అన్నారు.
అంతకుముందు నవంబర్ 13 న, జమ్మూ కాశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రదేశాలలో ముగ్గురు భారతీయ సైనికులు మరణించారు, పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఉరీ సెక్టార్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా, గురేజ్ సెక్టార్లో ఒకరు మృతి చెందినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
(The above story first appeared on LatestLY on Nov 16, 2020 04:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

