Baisakhi 2023: పంజాబ్లో బైసాఖీ పండుగ వేళ ఘోర రోడ్డు ప్రమాదం, యాత్రికులపైకి దూసుకువెళ్లిన ట్రక్కు, ఏడు మంది మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు
యూపీలోని హోషియార్పూర్ జిల్లాలోని ఖురల్గఢ్ సాహిబ్లో బైసాఖీ పండుగను జరుపుకోవడానికి వెళుతున్న ఏడుగురు యాత్రికులు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. వీరిని వెనక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో పది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని ఖురల్గఢ్ సాహిబ్లో బైసాఖీ పండుగను జరుపుకోవడానికి వెళుతున్న ఏడుగురు యాత్రికులు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. వీరిని వెనక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో పది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు, ఒకరు మృతి, పలువురికి గాయాలు, ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
మృతులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలోని మస్తాన్ ఖేరా నివాసితులని గర్హశంకర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) దల్జీత్ సింగ్ ఖాఖ్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉప పర్వత ప్రాంతం అని, డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కాలినడకన వెళ్తున్న 17 మంది యాత్రికులను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Apr 13, 2023 12:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

