Man Beaten To Death: బీహార్‌లో దారుణమైన ఘటన, కరోనా వచ్చిందంటూ వ్యక్తిని కొట్టి చంపేశారు, ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఒకరికి ఒకరు అండగా నిలవాల్సిన సమయంలో కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కరోనా (COVID 19) అనుమానితులుగా భావిస్తూ వారిపై దాడులకు పాల్పడుతున్నారు. బీహార్‌లోని సీతామార్హి జిల్లాలోని మహారాష్ట్ర నుంచి ఇద్దరు వ్యక్తులు తిరిగి రావడం గురించి కరోనా సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తిని స్థానికులు కొట్టి (Man Beaten To Death) చంపేశారు. బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో సోమవారం అర్థరాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

Man Beaten To Death: బీహార్‌లో దారుణమైన ఘటన, కరోనా వచ్చిందంటూ వ్యక్తిని కొట్టి చంపేశారు, ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
Representational Image (Photo Credits: ANI)

Sitamarhi, March 31: దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఒకరికి ఒకరు అండగా నిలవాల్సిన సమయంలో కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కరోనా (COVID 19) అనుమానితులుగా భావిస్తూ వారిపై దాడులకు పాల్పడుతున్నారు.

బీహార్‌లోని సీతామార్హి జిల్లాలోని మహారాష్ట్ర నుంచి ఇద్దరు వ్యక్తులు తిరిగి రావడం గురించి కరోనా సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తిని స్థానికులు కొట్టి (Man Beaten To Death) చంపేశారు. బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో సోమవారం అర్థరాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌కు చెందిన ఓ కార్మికుడు ఉపాధి కోసం​ మహారాష్ట్ర వలస వెళ్లాడు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి.

Here's ANI Tweet:

ఈ క్రమంలోనే అతను కుటుంబంతో సహా.. స్వస్థలం బిహార్‌కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్థానికులు ఆ కార్మికుడిని స్వగ్రామంలోకి అనుమతించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే వారిద్దరు అతనిపై దాడి చేశారు.

బీహార్ రాజకీయాలను తాకిన కరోనావైరస్

తీవ్రంగా గాయపడిన యువకుడిని రన్నిసైద్పూర్ పిహెచ్‌సిలో చేర్పించారు, కాని అతని పరిస్థితి ఆందోళనగా ఉండటంతో వైద్యులు అతన్ని మరొక ఆసుపత్రికి పంపారు. ముజఫర్‌పూర్‌లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి వెళుతుండగా బాబ్లూ మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

21రోజుల తర్వాత లాక్‌డౌన్‌ పొడిగింపు అంతా పుకారు

అనుమానాస్పద కేసులను పరీక్షించడానికి వీలుగా తమ గ్రామాలు మరియు పట్టణాల్లో బయటి రాష్ట్రాల నుండి వచ్చే ప్రజల వివరాలను సహాయ కేంద్రానికి తెలియజేయాలని బీహార్ ప్రభుత్వం గ్రామస్తులను కోరింది. అయితే, ఇన్ఫార్మర్ల భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి చొరవ తీసుకోలేదు.

(The above story first appeared on LatestLY on Mar 31, 2020 05:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).