Bihar: 10వ తరగతి పరీక్ష రాస్తూ హాల్లోనే చనిపోయిన విద్యార్థి, అధిక జ్వరం ఉన్నందున వద్దని వారించిన తల్లి, ఏడాది వేస్ట్ అవుతుందని పరీక్ష రాసిన రోహిత్, బీహార్లో విషాద ఘటన
బీహార్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పరీక్షలు రాయకుంటే ఏడాది వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఓ విద్యార్థి (Bihar Student) అధిక జ్వరం ఉన్నప్పటికీ పరీక్ష రాయడానికి వెళ్లాడు, పరీక్ష రాస్తూ మృత్యు ఒడిలోకి జారుకున్నాడు. మృతుడిని రోహిత్ కుమార్ గా గుర్తించారు.
Patna, Feb 21: బీహార్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పరీక్షలు రాయకుంటే ఏడాది వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఓ విద్యార్థి (Bihar Student) అధిక జ్వరం ఉన్నప్పటికీ పరీక్ష రాయడానికి వెళ్లాడు, పరీక్ష రాస్తూ మృత్యు ఒడిలోకి జారుకున్నాడు. మృతుడిని రోహిత్ కుమార్ గా గుర్తించారు.
నలంద జిల్లాలోని బిహార్ షరీఫ్ పట్టణంలో ఆదర్శ్ హైస్కూల్ లో (Adarsh High School) అతను 10వ తరగతి చదువుతున్నాడు. నివేదిక ప్రకారం.. అతని ఆరోగ్యం సరిగా లేనందున పాఠశాల పరిపాలన విభాగం బిఎస్ఇబి 2021 (BSEB Board Exam 2021) 10 వ తరగతి పరీక్షలు రాయడానికి అతనిని అనుమతించలేదు. అయితే ఆ కుర్రాడు వారి మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
అతడు ఎలాగైనా పరీక్ష రాస్తానని పట్టుబట్టడంతో అధికారులు అంగీకరించి ఒక్కడే బయట పరీక్ష రాయడానికి అనుమతించారు. అయితే పరీక్ష రాస్తున్న సమయంలో ఆరోగ్యం విషమించడంతో ఆ విద్యార్థి మృతిచెందాడు. చేతిలో పెన్ను.. పేపర్ పట్టుకుని మృత్యు ఒడికి చేరాడు. తల్లి వద్దని చెప్పినా వినకుండా పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ తల్లికి శోకాన్ని మిగిల్చాడు. ఈ ఘటనతో పాఠశాలలో విషాదం ఏర్పడింది.
పాఠశాల అధికారులు జిల్లా కంట్రోల్ రూమ్తో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా ఆరోగ్యం సరిలేకున్నా పరీక్షలు రాస్తున్నాడని సమాచారం ఇచ్చారు. తరువాత ఆమె తల్లి పరీక్షా కేంద్రానికి వచ్చి ఎంతగా చెప్పినా వినకపోవడంతో చివరకు తన కొడుకును బోర్డు పరీక్షలో రాసేందుకు అనుమతించాలని అధికారులను కోరింది. అయితే, అతను పరీక్ష రాస్తున్నప్పుడు అకస్మాత్తుగా అతని ఆరోగ్యం క్షీణించింది. రోహిత్ను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. కాగా 16 ఏళ్ల ఆస్తమా రోగి అని వైద్యులు ఆ తరువాత అతనికి తల్లికి తెలియజేశారు.
అంతకుముందు మొదటి షిఫ్టులో జరుగుతున్న 10 వ తరగతి యొక్క సోషల్ సైన్స్ సబ్జెక్టు పరీక్షను బిఎస్ఇబి రద్దు చేయవలసి వచ్చింది. మార్చి 8 న పరీక్ష నిర్వహిస్తామని బీహార్ బోర్డు అధ్యక్షుడు ఆనంద్ కిషోర్ తెలిపారు. సాంఘిక శాస్త్రం యొక్క మొదటి షిఫ్టులో 8,46,504 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని ఆయన వివరించారు. ఇప్పుడు వారి పరీక్ష మార్చి 8 న జరుగుతుంది. ఇంతలో, ప్రశ్నపత్రం లీక్ కేసుపై పూర్తి దర్యాప్తు ప్రారంభించబడింది. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,525 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 న ప్రారంభమయ్యాయి మరియు ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతాయి. సోషల్ పరీక్ష మాత్రం మార్చి 8న జరుగుతుంది.
(The above story first appeared on LatestLY on Feb 21, 2021 04:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

