KK Shailaja Rejects Magsaysay Award: ఆసియా అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించిన కేరళ మాజీ మంత్రి, రామన్ మెగసెసే అవార్డు వద్దంటూ ప్రకటన, పార్టీతో చర్చించి కీలక ప్రకటన చేసిన కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, ఇంతకీ ఆమె ఎందుకు అవార్డు వద్దన్నారో తెలుసా?

తానొక రాజకీయ పార్టీకి చెందిన నేత కాబట్టి, ఈ విషయంపై పార్టీతో సంప్రదించి నిర్ణయం చెబుతానని అవార్డు కమిటీకి ఆమె వివరించారు. అనంతరం తను అవార్డును నిర్ణయిస్తున్నట్లు కమిటీకి తెలిపారు. దీనికి కారణం.. శైలజ ఈ అవార్డు తీసుకునేందుకు పార్టీ హై కమాండ్ అంగీకరించకపోవడమే.

KK Shailaja Rejects Magsaysay Award: ఆసియా అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించిన కేరళ మాజీ మంత్రి, రామన్ మెగసెసే అవార్డు వద్దంటూ ప్రకటన, పార్టీతో చర్చించి కీలక ప్రకటన చేసిన కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, ఇంతకీ ఆమె ఎందుకు అవార్డు వద్దన్నారో తెలుసా?

Kerala, SEP 04:  రామ‌న్ మెగ‌సెసేను ఆసియా నోబెల్‌గా (Asian version of the Nobel Prize) పిలుస్తారు. 1957లో స్థాపించిన‌ రామన్ మెగసెసే అవార్డు (Magsaysay award) ఆసియా అత్యున్నత పురస్కారం. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరిట ఈ అవార్డు అందిస్తుంటారు. ఈ అవార్డును అమెరికాకు చెందిన రాక్ ఫెల్లర్ బ్రదర్స్, ఫిలిప్పీన్స్  (Philippines) ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇంత గొప్ప పుర‌స్కారం వ‌స్తే ఎవ‌రైనా ఎగిరి గంతేస్తారు. కానీ, కేర‌ళ ఆరోగ్య‌శాఖ మాజీ మంత్రి, సీపీఎం సీనియ‌ర్ నేత కేకే శైల‌జ (KK Shailaja) మాత్రం సున్నితంగా తిర‌స్క‌రించారు. దీని వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. రామన్ మెగసెసే ఫిలిప్పీన్స్ మూడో అధ్య‌క్షుడు (Philippine President). ఆ దేశంలో కమ్యూనిస్టులను ఉక్కుపాదంతో అణచివేశాడన్న చరిత్ర ఉంది. అందుకే ఆయన పేరుతో ఉన్న అవార్డును స్వీకరించడంలేదని కేకే శైలజ వెల్లడించారు. రాష్ట్రంలో నిఫా వైరస్, కోవిడ్ సోకిన సందర్భంగా వాటిని అదుపు చేయడంలో ఆమె సమర్ధవంతంగా పనిచేశారు. కేకే.శైలజ చేసిన సేవలకుగాను, ఆమె పేరును తమ కమిటీ రామన్ మెగసెసే అవార్డు కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై ఆమె అనుమతి కావాలని కోరారు. వారు అనుమతిస్తేనే అవార్డు కోసం పరిశీలించి, ప్రకటిస్తారు.

Cyrus Mistry: షాకింగ్ న్యూస్! రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్‌ మిస్త్రీ కన్నుమూత, డివైడర్‌ను ఢీకొట్టిన మిస్తీ కారు, విషాదంలో టాటా ఉద్యోగులు, పలువురు ప్రముఖుల సంతాపం 

అయితే, తానొక రాజకీయ పార్టీకి చెందిన నేత కాబట్టి, ఈ విషయంపై పార్టీతో సంప్రదించి నిర్ణయం చెబుతానని అవార్డు కమిటీకి ఆమె వివరించారు. అనంతరం తను అవార్డును నిర్ణయిస్తున్నట్లు కమిటీకి తెలిపారు. దీనికి కారణం.. శైలజ ఈ అవార్డు తీసుకునేందుకు పార్టీ హై కమాండ్ అంగీకరించకపోవడమే. ఈ అంశంపై స్వయంగా కేకే శైలజ (KK Shailaja) ఈ వివరాల్ని వెల్లడించారు. తనకు కమిటీ నుంచి సమాచారం అందిందని, అయితే పార్టీని సంప్రదించిన తర్వాత అవార్డు తీసుకోకూదని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు.

Puducherry Shocker: తన కొడుకు కంటే బాగా చదువుతున్నాడని చంపాలని చూసింది, కొడుకు స్నేహితుడికి కూల్‌డ్రింక్‌లో విషమిచ్చిన మహిళ, పుదుచ్చేరిలో దారుణం, తన కొడుకే క్లాస్ ఫస్ట్ రావాలని ప్లాన్ వేసిన మహిళ 

‘‘సాధారణంగా ఈ అవార్డుకు రాజకీయ నాయకులను పరిగణనలోకి తీసుకోరు. అయినా, నాకీ అవార్డు ఇవ్వాలనుకున్నారు. అయితే, నేను సీపీఎంలో కేంద్ర సభ్యురాలిని. ఈ అవార్డు అందజేసే సంస్థ కమ్యూనిజాన్ని నమ్మదు. అందువల్ల ఆ సంస్థ అందజేసే అవార్డును తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నా’’ అని కేకే శైలజ చెప్పారు. రామన్ మెగసెసే అవార్డు అంతర్జాతీయంగా చాలా ప్రతిష్టాత్మకమైనది. దీన్ని ‘ఆసియా నోబెల్’గా కూడా పిలుస్తారు.

(The above story first appeared on LatestLY on Sep 04, 2022 11:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).