Puducherry Shocker: తన కొడుకు కంటే బాగా చదువుతున్నాడని చంపాలని చూసింది, కొడుకు స్నేహితుడికి కూల్‌డ్రింక్‌లో విషమిచ్చిన మహిళ, పుదుచ్చేరిలో దారుణం, తన కొడుకే క్లాస్ ఫస్ట్ రావాలని ప్లాన్ వేసిన మహిళ

తన కుమారుడి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడని ఓ విద్యార్థిపై ఆ తల్లి అసూయ పెంచుకుంది. చివరికి ఆ విద్యార్థిని మట్టు మెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో (Puducherry) శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది

Puducherry Shocker: తన కొడుకు కంటే బాగా చదువుతున్నాడని చంపాలని చూసింది, కొడుకు స్నేహితుడికి కూల్‌డ్రింక్‌లో విషమిచ్చిన మహిళ, పుదుచ్చేరిలో దారుణం, తన కొడుకే క్లాస్ ఫస్ట్ రావాలని ప్లాన్ వేసిన మహిళ
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Puducherry, SEP 04: తన కుమారుడి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడని ఓ విద్యార్థిపై ఆ తల్లి అసూయ పెంచుకుంది. చివరికి ఆ విద్యార్థిని మట్టు మెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో (Puducherry) శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో (Karaikkal) ఓ ప్రైవేటు పాఠశాల ఉంది. ఇందులో రాజేంద్రన్ (Rajendran), మాలతి దంపతుల కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఈ విద్యార్థి హఠాత్తుగా స్పహ తప్పి పడిపోయాడు. చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కడి సిబ్బంది ఆస్పత్రికి సకాలంలో తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, ఆ బాలుడు విషం తాగినట్లు వైద్యుల పరిశీలన తేలింది. ఆ పాఠశాల సెక్యూరిటీ ఇచ్చిన శీతల పానీయం తాగడంతోనే తాను అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు కోలుకున్న తరువాత తల్లిదండ్రుల దృష్టికి ఆ విద్యార్థి తీసుకెళ్లాడు.

Punjab: ఆప్ ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన ఆమె భర్త, దాడికి సంబంధించిన వీడియో వైర‌ల్, సుమోటో నోటీసుగా స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపిన పంజాబ్ మ‌హిళ క‌మిష‌న్ చైర్మెన్ 

దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా, ఓ మహిళ తనకు కూల్‌డ్రింక్‌ (Cool drink) ఇచ్చి ఆ విద్యార్థికి ఇవ్వాలని సూచించినట్లు వాంగ్ములం ఇచ్చాడు. డబ్బులకు కక్కుర్తిపడి తాను ఆమె చెప్పినట్లు చేశానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు.

Hyderabad Shocker: ఇంట్లో ఎవరూ లేని సమయంలో అన్న పాడుబుద్ధి, ఏడాది నుంచి చెల్లిలిపై అత్యాచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు 

ఓ మహిళ రెండు కూల్‌ డ్రింక్‌ బాటిళ్లను సెక్యూరిటీ సిబ్బందికి ఇవ్వడాన్ని గుర్తించారు. ఆ దృశ్యాల ఆధారంగా సహాయరాణి విక్టోరియా (Victoria) అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎప్పుడూ తరగతిలో ఫస్ట్‌ వచ్చే తన కుమారుడిని అధిగమించి రాజేంద్రన్, మాలతి కుమారుడు తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడని పోలీసులకు ఆమె వివరించింది. తన కుమారుడి కంటే అధికంగా మార్కులు సాధిస్తున్న ఈ విద్యార్థిపై తనకు ఈర్ష్య, కోపం పెరిగిందని, అందుకే విషం ఇచ్చి మట్టుబెట్టే ప్రయత్నం చేశానని అంగీకరించింది. ఇది విని పోలీసులు కూడా నివ్వెరపోయారు.

(The above story first appeared on LatestLY on Sep 04, 2022 12:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).