Delhi Violence: సీఏఏ హింసపై మండిపడిన ఢిల్లీ హైకోర్టు, దేశంలో 1984 ఘటన జరగనివ్వమన్న న్యాయస్థానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షమే ప్రజల్లో విశ్వాసం నెలకొల్పాలని ఆదేశాలు
దేశరాజధానిలో సీఏఏ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) బుధవారం తీవ్రంగా స్పందించింది. దేశంలో మరో 1984 ఘటనలను (1984 Riots) పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈశాన్య ఢిల్లీలో ఐబీ అధికారి అంకత్ శర్మ మృతదేహం లభ్యం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర ఘటన అని అభివర్ణించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే బాధిత కుటుంబాలను కలుసుకోవాలని ఆదేశించింది.
New Delhi, February 26: దేశరాజధానిలో సీఏఏ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) బుధవారం తీవ్రంగా స్పందించింది. దేశంలో మరో 1984 ఘటనలను (1984 Riots) పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈశాన్య ఢిల్లీలో ఐబీ అధికారి అంకత్ శర్మ మృతదేహం లభ్యం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర ఘటన అని అభివర్ణించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే బాధిత కుటుంబాలను కలుసుకోవాలని ఆదేశించింది.
ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ప్రధాని మోదీ
బాధితులకు సాయం అందించేందుకు హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలని, బాధితులను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది.
బాధితుల కోసం కనీస సదుపాయాలతో కూడిన పునరావాస షెల్టర్లను వెంటనే ఏర్పాటు చేయాలని కోరింది. అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంలు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని కోర్టు ఆదేశించింది.
Update by ANI
Delhi violence matter in Delhi High Court: The Court says, we cannot let another 1984 happen in this country; Not under the watch of this Court pic.twitter.com/wXugfeg9yq
— ANI (@ANI) February 26, 2020
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ బ్రాంచ్)ను (Deputy Commissioner of Police (Crime Branch), కపిల్ మిశ్రా (Kapil Mishra) యొక్క వీడియోను చూశారా అని ధర్మాసనం అడిగినప్పుడు క్లిప్ ఇంకా అతనిని చూడలేదని చెప్పారు. కాగా నిరసనకారులపై కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వాటిని ఆయన ఖండిస్తున్నారు.
ఇదిలా ఉంటే పోలీసు అధికారి యొక్క సమాధానంపై కోర్టు తీవ్రంగా మండిపడింది. వీడియో అన్ని సమాచార మాధ్యమాలకు వచ్చినప్పటికీ అటువంటి వీడియో గురించి మీకు ఎలా తెలియదని వ్యాఖ్యానించింది. "మీ కార్యాలయంలో చాలా టీవీలు ఉన్నాయి, ఒక పోలీసు అధికారి వీడియోలను చూడలేదని ఎలా చెప్పగలను? ఢిల్లీ పోలీసుల తీరుపౌ ఇప్పుడు మాకు ఆందోళన కలుగుతోందని ధర్మాసనం తెలిపింది.
ఈ నివేదిక ప్రచురించే సమయానికి ఢిల్లీ హింసలో (anti-CAA protesters) మరణించిన వారి సంఖ్య 21 కి చేరుకుంది, గురు తేగ్ బహదూర్ (జిటిబి) ఆసుపత్రిలో తాజాగా మరో మరణం నిర్ధారించబడింది. సోమవారం జరిగిన ఘర్షణల్లో మొదటి మరణం నమోదైంది, మంగళవారం మొత్తం మరణాల సంఖ్య పెరిగింది. ఈ రోజు ధృవీకరించబడిన మరణ కేసులు గత రెండు రోజులుగా క్లిష్టమైన పరిస్థితుల్లో చేరిన బాధితులవిగా తెలుస్తోంది.
(The above story first appeared on LatestLY on Feb 26, 2020 03:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

