Flood Warning: మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, భారీ వరదలతో నదులు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించిన CWC, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు పొంచి ఉన్న వరద ముప్పు.
Heavy rains. (Photo Credits: PTI)

New Delhi, October 12: కర్ణాటకలో తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) మంగళవారం కేరళలోని ఒక నదికి రెడ్ అలర్ట్ (తీవ్ర వరద పరిస్థితి) ప్రకటించింది. అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడులోని మరో ఐదు నదులకు ఆరెంజ్ అలర్ట్ (తీవ్రమైన వరద పరిస్థితి) (Flood Warning Issued) ప్రకటించింది.

మంగళవారం ఉదయం 8.30 గంటలకు ముగిసిన 24 గంటల సమయంలో, కేరళ, మాహే (పుదుచ్చేరి) లోని అత్యంత భారీ వర్షపాతం నమోదైంది.  తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

రానున్న మూడు రోజుల పాటు అండమాన్ & నికోబార్ దీవులు మరియు కేరళ & మాహీలోని కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rainfall Due to Cyclonic Circulation Over Arabian Sea) ఉందని IMD అంచనా వేసింది. కోస్తాంధ్ర, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి & కారైకాల్‌లోని పలు  ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

నీట మునిగిన బెంగ‌ళూరు విమానాశ్రయం, ట్రాక్టర్లలో ఎయిర్‌పోర్టుకి చేరుకున్న ప్రయాణికులు, రాబోయే నాలుగు రోజుల పాటు బెంగుళూరుకు భారీ వర్షాలు

అండమాన్ & నికోబార్ దీవులు, కేరళ & మహే, తమిళనాడు, పుదుచ్చేరి & కారైకాల్‌లోని కొన్ని ప్రాంతాలలో మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గంటకు 50-60 కిమీ గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన తుఫాను ప్రసరణ దీనికి కారణం. రాబోయే 3-4 రోజుల్లో ఇది కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ సోమవారం రాత్రి బులెటిన్‌లో తెలిపింది.

మంగళవారం ఉదయం సిడబ్ల్యుసి వరద బులెటిన్ ప్రకారం, కేరళలోని కొల్లం జిల్లాలోని అర్క్కనూరు వద్ద ఇథిక్కర నదికి రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ నదికి వరద పోటెత్తింది. ఉదయం 6.00 గంటలకు ఈ నది ప్రవాహం పెరుగుతూ 87.0 మీటర్ల స్థాయికి చేరింది. ఇది 0.10 మీ వరద నీరు వస్తే అది ప్రమాద కర స్థాయికి చేరుకున్నట్లే.  ఈ నది సామర్థ్యం 87.1 మీగా ఉంది. 2018లో ఈ నదికి 86.37 మీటర్లు వరద పోటెత్తగా తాజాగా 0.73 మీ ఎక్కువగా అది క్రాస్ అయింది.

మాండ్య జిల్లాలోని టికె హల్లి వద్ద శింషా నది కోసం కర్ణాటకలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉదయం 6.00 గంటలకు, ఇది స్థిరమైన ధోరణితో 583.49 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తోంది. దీని సామర్థ్యం 582.5 m. దాన్ని  ఈ వరదలతో దాటి ప్రమాదకరంగా మారింది.

కేరళలో, పతనంతిట్ట జిల్లాలోని తుంపమోన్ వద్ద అచ్చన్ కోవిల్ నది తీవ్ర స్థాయిలో వరద నీరు చేరింది. ఉదయం 6.00 గంటలకు, ఇది 10.35 మీటర్ల స్థాయిలో పెరుగుతున్న ధోరణితో ప్రవహిస్తోంది, ఇది 10.0 మీ ప్రమాద స్థాయి కంటే 0.35 మీ ఎక్కువగా వరద నీరు చేరింది,

కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని వెల్లైకడవు వద్ద కరమణ నదికి భారీగా వరద నీరు చేరింది. దీని సామర్థ్యం  93.15 మీటర్ల కాగా దాన్ని దాటే  స్థాయిలో  ప్రమాదకరంగా మారి ప్రవహిస్తోంది.

తమిళనాడులో, కన్యాకుమారి జిల్లాలోని తిరువరంబు వద్ద ఉన్న కొడైయార్ నది కూడా ఉగ్రరూపం దాల్చింది. 13.01 మీటర్ల స్థాయిలో పెరుగుతున్న ధోరణితో ప్రవహిస్తోంది, ఇది ప్రమాద స్థాయి కంటే 12.0 మీ కంటే 1.01 మీటర్లు మరియు దాని మునుపటి కంటే 1.67 మీ. HFL 14.68 m గా ఉంది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కుజితురై వద్ద ఉన్న తంబ్రపర్ణి నది కూడా భారీ వర్షాలకు నిండిపోయి ప్రమాదకరంగా మారింది. ఈ నదిలోకి కూడా సామర్థ్యానికి మించి వరద నీరు పోటెత్తుతోంది.

IMD డేటా ప్రకారం, మంగళవారం ఉదయం 8.30 గంటలకు ముగిసిన 24 గంటల సమయంలోఈ కింది విధంగా వర్షపాతం నమోదు చేయబడింది:

కేరళ: కరీపూర్ - 25 మిమీ; కోజికోడ్ - 22 మిమీ; కన్నూర్ - 17 మిమీ; పునలూరు - 14 మిమీ; పాలక్కాడ్ - 8 మిమీ మరియు త్రిస్సూర్ - 6 మిమీ. తమిళనాడు: వాల్‌ప్రాయ్ - 10 మిమీ; నాగపట్టణం - 6 మిమీ మరియు తంజావూరు - 5 మిమీ.