IMD Weather Update: ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో మరో 5 రోజులు మండిపోనున్న ఎండలు, రుతుపవనాలు వచ్చినా భానుడు సెగలు తప్పవని ఐఎండీ హెచ్చరిక
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల సగం గడిచినా పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు కూడా ఎండలు మండిపోతాయని భారత వాతావరణ కేంద్రం (India Meteorological Department) సోమవారం ప్రకటించింది.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల సగం గడిచినా పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు కూడా ఎండలు మండిపోతాయని భారత వాతావరణ కేంద్రం (India Meteorological Department) సోమవారం ప్రకటించింది.
సోమవారం భారత వాతావరణ శాఖ బులెటిన్ ప్రకారం, రాబోయే ఐదు రోజుల్లో ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్లో హీట్వేవ్ పరిస్థితులు అంచనా వేయబడ్డాయి. దక్షిణ ఉత్తరప్రదేశ్, గంగా నది పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్లలో వచ్చే ఐదు రోజులలో, రాబోయే రెండు రోజులలో వేడి గాలులు కొనసాగుతాయి. మధ్యప్రదేశ్లో మరో రెండు రోజులు భానుడి ప్రతాపం కొనసాగుతుందని ఐఎండీ చెప్పింది.
(The above story first appeared on LatestLY on Jun 12, 2023 06:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

