New Delhi, May 28: భారత్లో సెకండ్ వేవ్ కోవిడ్ కేసులు క్రమేపీ తగ్గుతుండటం గొప్ప ఊరటనిచ్చే విషయం. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు తమ వద్ద కోవిడ్ ఉధృతి తగ్గినట్లు కేంద్రానికి నివేదిక అందించాయి. దాదాపు చాలా రాష్ట్రాల్లో రోజూవారీ కొత్త కేసుల క్షీణత కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశంలో పాజిటివిటీ రేటు కూడా 9% కి పడిపోయింది. కోలుకునే వారి రేటు 90 శాతానికి పైగా మెరుగైన స్థితిలో కొనసాగుతుంది. అయితే మరణాల రేటులో మాత్రం గణనీయమైన మార్పు లేదు. ప్రతిరోజూ 3 వేలకు పైగా మరణాలు నమోదవడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.
గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,86,364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 14 నుంచి ఇదే అత్యల్పం. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,4573 చేరింది. నిన్న ఒక్కరోజే 3,660 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,18,895 కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,59,459 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,48,93,410 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 23,43,152 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 90.34% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 8.05 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.16% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
India reports 1,86,364 new #COVID19 cases, 2,59,459 discharges & 3,660 deaths in last 24 hrs, as per Health Ministry
Total cases: 2,75,55,457
Total discharges: 2,48,93,410
Death toll: 3,18,895
Active cases: 23,43,152
Total vaccination: 20,57,20,660 pic.twitter.com/px2jTVCVhY
— ANI (@ANI) May 28, 2021
మే 27 నాటికి దేశవ్యాప్తంగా 33,90,39,861 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 20,70,508 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 29,19,699 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 20.57 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 20,57,20,660 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 16.15 కోట్లు ఉండగా, సెకండ్ డోస్ తీసుకున్న వారి సంఖ్య 4.38 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం.